• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
    MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
    ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
    Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
    See More

    NZ vs PAK: న్యూజిలాండ్ భారీ స్కోరు

    వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం న్యూజిలాండ్-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి. 401 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బ్యాటర్లు డేవన్ కాన్వే (35), రచిన్ రవీంద్ర(108), కేన్ విలియమ్సన్ (95), డారిల్ మిచెల్ (29), గ్లెన్ ఫిలిప్స్‌ (41) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు, పాక్ బౌలర్లు, , షహీన్‌ అఫ్రిది … Read more

    నా మనసంతా అక్కడే ఉంటుంది: హార్థిక్

    గాయం కారణంగా టీమిండియా జట్టు నుంచి వైదొలగడంపై ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమవుతున్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం లేకపోతున్నా? జట్టుకు దూరంగా ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది. కష్టకాలంలో నాపై ప్రేమ కురిపించి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హార్థిక్ ఆవేదనను వ్యక్తం చేశారు. వన్డే వరల్డ్‌కప్‌ నుంచి ఇలా అర్ధంతరంగా నిష్క్రమించడం బాధగా ఉందని ఉద్వేగానికి గురయ్యాడు.

    NZ vs PAK: పాక్ బౌలింగ్

    వన్డే ప్రపంచకప్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉదయం న్యూజిలాండ్-పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన పాకిస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు: న్యూజిలాండ్‌: డేవన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్‌, మార్క్‌ చాప్‌మన్, మిచెల్ శాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ పాకిస్థాన్‌: అబ్దుల్లా షఫీక్, ఫకర్ జమాన్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, సౌద్ … Read more

    టీమిండియాకు బిగ్‌ షాక్‌

    టీమిండియాకు బిక్ షాక్ తిగిలింది. గాయం కారణంగా హార్దిక్‌ పాండ్య టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు. చీలమండ గాయం కావడంతో అతడు NCAకి వెళ్లిపోయాడు. గాయం తీవ్రత కారణంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు హార్దిక్‌ దూరమైనట్లు ఐసీసీ ధ్రువీకరించింది. అతడి స్థానంలో యువ పేసర్ ప్రసిధ్‌ కృష్ణను తీసుకుంది.

    నేడు ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ మ్యాచ్

    వన్డే వరల్డ్‌కప్‌లో కీలక జట్లు పోరాటాలకు సిద్ధమయ్యాయి. మధ్యాహ్నం ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌ను ఢీకొనబోతుండగా, ఉదయం న్యూజిలాండ్‌.. పాకిస్థాన్‌తో తలపడబోతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి తర్వాత బలంగా పుంజుకుని ఆసీస్ వరుసగా నాలుగు విజయాలు సాధించింది. అయితే గాయంతో మ్యాక్స్‌వెల్‌, వ్యక్తిగత కారణాలతో మిచెల్‌ మార్ష్‌ దూరం కావడం ఆ జట్టును దెబ్బ తీసేదే. మరోవైపు 6 మ్యాచ్‌ల్లో 5 ఓడి దాదాపుగా సెమీస్‌కు దూరమైన ఇంగ్లాండ్‌ పరువు కోసం పోరాడనుంది.

    NED vs AFG: అప్గాన్‌ ఘన విజయం

    వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌.. 31.3 ఓవర్లలోనే 181/3 స్కోరు చేసి టార్గెట్‌ ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్‌ షా (52), హష్మతుల్లా (56) అర్ధశతకాలతో రాణించారు. అజ్మతుల్లా 31*, ఇబ్రహీం జడ్రాన్‌ 20 పరుగులతో పర్వాలేదనిపించారు. నెదర్లాండ్ బౌలర్లలో లొగాన్‌, రోలోఫ్, జుల్ఫికర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో ఆఫ్గాన్‌ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

    శ్రీవారిని దర్శించిన పంత్‌, అక్షర్‌

    AP: టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఈ ఇద్దరు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన పంత్, అక్షర్‌లతో ఫొటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. టీటీడీ సిబ్బంది సైతం ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. దాంతో ఆలయం వెలుపల సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    డిసెంబర్ 19న ఐపీఎల్‌ వేలం

    ఐపీఎల్‌ 2024 సీజన్‌కు సంబంధించి డిసెంబర్‌ 19న వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దుబాయ్‌ వేదికగా ఈ వేలం ఉంటుందని స్పష్టం చేసింది. నవంబర్ 26లోగా ప్రతీ ఫ్రాంఛైజీ తాము రిటైన్ చేసుకుంటున్న ప్లేయర్లు, వేలానికి వదిలేసిన ఆటగాళ్ల వివరాలను తెలియజేయాలని సూచించింది. ఈసారి ఐపీఎల్ 2024 వేలంలో ప్రతీ ఫ్రాంఛైజీ రూ.100 కోట్ల పర్సు వాల్యూను కలిగి ఉండనున్నాయి. గతంలో ఫ్రాంఛైజీల పర్సు వాల్యూ రూ.95 కోట్లు ఉండగా ఈసారి రూ.5 కోట్లు పెరిగింది.

    నెదర్లాండ్‌ను చుట్టేసిన అఫ్గాన్‌ స్పిన్నర్లు

    వరల్డ్‌కప్‌లో అఫ్గనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్‌ 46.3 ఓవర్లలో 179 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయ్యింది. నెదర్లాండ్ బ్యాటర్లలో సైబ్రాండ్‌ (58) అర్ధశతకంతో రాణించాడు. మ్యాక్స్‌ 42, కొలిన్‌ అక్కర్‌మన్‌ 29 పరుగులతో పర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లు ఎవరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయకపోవడంతో నెదర్లాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అటు అఫ్గాన్‌ బౌలర్లలో నబీ 3 వికెట్లు పడగొట్టగా.. నూర్‌ అహ్మద్‌ 2, ముజీబుర్‌ రహ్మన్‌ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ విజయానికి 180 పరుగులు అవసరం.

    సచిన్‌ విగ్రహంపై అభిమానులు అసంతృప్తి

    వాంఖడే స్టేడియంలో నిన్న సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే.. అయితే దీనిపై భారత క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ విగ్రహం ఆసీస్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను పోలి ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ విగ్రహాన్ని సరిగ్గా రూపొందింలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు స్టీవ్‌ స్మిత్‌ విగ్రహం భారత్‌లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్‌ చేస్తున్నారు.