• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
    MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
    ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
    Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
    See More

    ‘మా దేశానికొస్తే అతడికి రాళ్ల దెబ్బలు తప్పవు’

    శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో ‘టైమ్‌డ్‌ ఔట్’ వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. బంగ్లా కెప్టెన్ షకిబ్ తీరుపై శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మ్యాచ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన సోదరుడు ట్రెవిస్ కూడా షకిబ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘గేమ్‌లో షకిబ్ క్రీడా స్ఫూర్తి, మానవీయ విలువలు కూడా పాటించకపోవడం దారుణం. షకిబ్‌ను శ్రీలంకలోకి రానివ్వకూడదు. ఒకవేళ అతడు అంతర్జాతీయ మ్యాచ్‌ లేదా ఎల్‌పీఎల్‌లో పాల్గొంటే మాత్రం రాళ్ల దెబ్బలకు సిద్ధంగా ఉండాలి’. అని ట్రెవిస్‌ పేర్కొన్నాడు.

    అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి: షమీ

    పాక్‌ మాజీ ఆటగాడు హసన్‌ రజా టీమిండియాపై ఆరోపణలు గుప్పించాడు. భారత్ ఆడే మ్యాచ్‌ల కోసం విభిన్న బంతులను వాడుతున్నారని విమర్శలు చేశాడు. దీంతో అతడి నోటిదురుసుపై భారత పేసర్ మహమ్మద్‌ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి. మీ గేమ్‌ మీద దృష్టిపెట్టాలి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కాదు. ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం హాస్యాస్పదం. మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు.’ అని షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ పెట్టాడు. ఇప్పుడదీ వైరల్‌గా మారింది.

    షమీకి ఆఫర్‌ ఇచ్చిన హీరోయిన్‌..

    టీమిండియా బౌలర్ షమీకి ఓ హీరోయిన్ ఆఫర్ ఇచ్చింది. షమీని పెళ్లి చేసుకుంటానని పాయల్ ఘోష్ నేరుగా కోరింది. తన సోషల్‌ మీడియా ఖాతా నుంచి షమీకి ప్రపోజ్ చేసింది. కానీ షమీని పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేక షరతు ఇలా పెట్టింది. ‘షమీ.. నువ్వు ఇంగ్లిష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.’ అంటూ ఒక కండీషన్‌ పెట్టి ట్వీట్ చేసింది. ‘మహ్మద్ షమీ.. సెమీ-ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి మీకు ఏ సహాయం కావాలి చెప్పాలని కోరింది’. … Read more

    వన్డే ఐసీసీ ర్యాంకులు విడుదల

    ICC వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ నంబర్‌వన్‌ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ రెండో స్థానానికి దిగజారాడు. శుభ్‌మన్‌ గిల్ 830 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్‌ అజామ్‌ 824 పాయింట్లు రెండో స్థానంలో ఉన్నాడు. క్వింటన్ డికాక్‌ (771), విరాట్ కోహ్లీ (770), డేవిడ్ వార్నర్ (743) తర్వాతి స్థానాల్లో నిలిచారు. శ్రేయస్‌ అయ్యర్ 17స్థానాలను ఎగబాకి 18వ ర్యాంక్‌ను సాధించాడు.

    BAN vs SL: బంగ్లాదేశ్‌ టార్గెట్‌ ఫిక్స్‌

    వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక మంచి స్కోరు చేసింది. 49.3 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 279 రన్స్ చేసింది. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక సెంచరీ (108)తో చెలరేగాడు. వికెట్లు పడుతున్న నిలకడగా ఆడి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. మిగతా బ్యాటర్లలో నిస్సంక 41, సమరవిక్రమ 41, ధనంజయ 34 రాణించారు. బంగ్లా బౌలర్లలో తంజీన్‌ హసన్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షకీబుల్ 2, షోరిఫుల్‌ 2, మెహిడి హసన్ 1 వికెట్ తీశారు. బంగ్లా విజయానికి … Read more

    ‘సలార్’ ట్రైలర్ విడుదల డేట్ ఫిక్స్?

    ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సలార్‌ ట్రైలర్‌ నవంబర్‌ చివరి వారం లేదా డిసెంబర్‌ మొదట్లో రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సలార్‌కు సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు: జడ్డూ

    టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను కెప్టెన్‌గానే ఆలోచిస్తా. ఆల్‌రౌండర్‌గా నా పాత్ర ఏంటో తెలుసు. మ్యాచ్‌పై నా ప్రదర్శనతో ప్రభావం చూపించడానికే ప్రయత్నిస్తా. ఒక క్యాచ్‌ పట్టగానే.. మైదానంలో రిలాక్స్‌ అయిపోను. మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. కొన్ని సార్లు మిస్‌ఫీల్డ్ కావచ్చు.. కానీ చివరి వరకు ప్రయత్నించడం మాత్రం ఆపను’. అని జడ్డూ చెప్పుకొచ్చాడు.

    అతడి వల్లే భారీ స్కోరు సాధించాం: రోహిత్

    దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీతో భారీ స్కోరు సాధించగలిగామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఎంతో కీలక పాత్ర పోషించారని తెలిపాడు. అందుకే దక్షిణాఫ్రికాపై భారత్ 243 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిందన్నాడు. ఇంగ్లాండ్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని మరీ విజయం సాధించామని చెప్పాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతంగా ఆడాడని రోహిత్ కొనియాడాడు.

    భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా కుప్పకూలిందిలా?

    వన్డే ప్రపంచకప్‌ భాగంగా దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 326 పరుగులు చేసింది. కోహ్లీ సెంచరీతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 77 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు మరోసారి విజృంభనతో సఫారీ జట్టును 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్‌ అయింది. జడేజా 5 వికెట్లు తీశాడు.. షమీ, కుల్‌దీప్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌ ఒక వికెట్ తీశాడు. దీంతో టీమిండియా 243 పరుగుల తేడాతో భారీ విజయం … Read more

    న్యూజిలాండ్‌పై పాక్ విజయం

    వరల్డ్‌కప్‌లో కివీస్‌ జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం మ్యాచ్‌కు అటంకం కలిగించడంతో డక్‌వర్త్‌లూయిస్‌ ప్రకారం పాక్‌ను విజేతగా ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ 401 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో పాక్‌ 160/1 (21.3) స్కోరుతో ఉన్నప్పుడు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. తిరిగి మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత 25.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం పడింది. అప్పుడు పాక్‌ స్కోరు 200/1. DLS ప్రకారం 21 పరుగులు ముందుండటంతో అంపైర్లు … Read more