• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆహ నా పెళ్లంట’ ట్రైలర్ అదిరింది

    రాజ్ తరుణ్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన ఆహ నా పెళ్లంట చిత్రం ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. కనీ వినీ ఎరుగని గోలంట అనే క్యాప్షన్ ఇచ్చిన సినిమా పెళ్లి చుట్టూ తిరుగుతుంది. చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. సాయిదీప్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అమల, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రల్లో నటించారు. కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమాను తెరకెక్కించారు. నో బాల్ నారాయణ రాజ్ తరుణ్ తండ్రిగా హర్ష వర్ధన్ నటించారు.

    ‘కాంతార’ రిషభ్‌ శెట్టితో ఏబీ డివిల్లీర్స్‌

    ప్రాంతీయ సినిమాగా మొదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే వినిపిస్తోంది. తాజాగా ఐపీఎల్‌ బెంగళూరు ఫ్రాంచైజీ కాంతారతో జతకట్టింది. ఏబీ డివిల్లీర్స్‌తో కలిసి రిషభ్‌ శెట్టి ‘కాంతార’ అంటూ చేసిన ఓ [వీడియో](url)ను పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. It’s a match.The real 360s today of the film industry and Cricket.#Kantara @shetty_rishab @ABdeVilliers17 @RCBTweets @hombalefilms @VKiragandur @gowda_sapthami @HombaleGroup @ChaluveG @Karthik1423 … Read more

    ‘వారిసు’ సాంగ్‌ ప్రోమోపై ట్రోల్స్‌

    విజయ్‌ దళపతి, రష్మిక మంధాన లీడ్‌ రోల్స్‌లో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా ‘వారిసు’. తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలి పాటకు సంబంధించిన ప్రోమోను ఇవాళ విడుదల చేశారు. దీనికి థమన్‌ సంగీతం అందించగా, జానీ మాస్టర్‌ నృత్య రీతులు సమకూర్చారు. అయితే ప్రోమో విడుదలైన తర్వాతి నిమిషం నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్‌ మొదలయ్యాయి. అదే మ్యూజిక్, అవే స్టెప్పులు ఎన్నిసార్లు భయ్యా అంటూ థమన్, జానీ మాస్టర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

    కాలేజీల్లో ‘లైక్,షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ టీం

    ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ టీం ప్రచారంలో జోరు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో తిరుగుతూ సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్ కళాశాల విద్యార్థులతో చిత్రబృందం మమేకమైంది. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తమ స్టెప్పులతో కాసేపు అలరించారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు. తమ సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కాగా, ఈ మూవీ రేపు విడుదలవుతోంది. Team #LikeShareSubscribe had a Blasting … Read more

    అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ ట్రైలర్‌

    దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 2009లో విడుదలైన వెండితెర అద్భుతం అప్పట్లో సినిమా ప్రపంచాన్ని ఉర్రూతలూగించి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ‘అవతార్‌’ సీక్వెల్‌కు సంబంధించిిన ట్రైలర్ విడుదలైంది. ఇటీవల అవతార్‌ రీ రిలీజ్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేలా ఉంది.

    షారూక్ ఖాన్ ‘పఠాన్’ టీజర్ విడుదల

    బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ‘పఠాన్’ మూవీ తెలుగు టీజర్ విడుదలైంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో కూడుకున్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హుషారెత్తిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దీపిక పదుకొనె షారూక్‌తో కలిసి నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశాల్ అండ్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25కు థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    సమంత డెడికేషన్‌కి స్టంట్ మాస్టర్ ఫిదా

    సమంత డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయానని యశోద సినిమా స్టంట్ కొరియోగ్రఫర్ యానిక్ బెన్ వెల్లడించాడు. ఈ మేరకు స్టంట్ కొరియోగ్రఫర్ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘సాధ్యమైనంత వరకు మేం యాక్టర్ భద్రతకు ప్రాధాన్యమిస్తాం. ముందుగా ఫైట్ మాస్టర్లతో కంపోజ్ చేసి నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. దీంతో వారికి టైమింగ్ గుర్తుంటుంది. సులువుగా చేయగలరు. సమంత ది బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది. అలాంటి వారితో పనిచేయడం మంచి అనుభూతిని కల్గిస్తుంది. ఇందులో ఫైట్లన్నీ సహజంగా ఉంటాయి’ అని చెప్పాడు.

    ‘హరోం హర’ అంటున్న సుధీర్‌బాబు

    టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు ‘హరోం హర’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ [వీడియో](url)ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు జ్ణానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్నారు. 1989లో కుప్పం ప్రాంతంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. Just in case you missed it, here's … Read more

    నా ఫ్యాన్స్‌కు నచ్చనిది చేయను: బాలకృష్ణ

    అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ ప్రీరిలీజ్ ఇవెంట్‌లో బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ బాగుంది. సినిమా కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. నాకూ ఇలాంటి చిత్రాల్లో నటించాలని ఉంటుంది. కాకపోతే నా పరిమితులు నాకున్నాయి. నా ఫ్యాన్స్, ప్రేక్షకులకు నచ్చనిది వాళ్లపై బలవంతంగా రుద్దాలని అనుకోను. ఈ సినిమా విజయవంతమవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్‌ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించింది. నవంబర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.

    LIVE: ప్రీ రిలీజ్ ఈవెంట్

    అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాకేశ్ శశి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కాగా, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్, అచ్చు ఇద్దరు సంగీతం అందించారు.