• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బ్రో’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘బ్రో’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. ‘మై డియర్ మార్కెండేయ’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సింగిల్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియాప్రకాశ్ వారియర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమా నిర్మితమైంది.

    ‘శాకుంతలం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

    సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. మల్లికా.. మల్లికా అంటూ సాగే ప్రేమగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో సమంత అందాలు ఆరబోసింది. సమంత నడుము సొగసు చూపిస్తూ అందాల దేవతలా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా అలరిస్తోంది. సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటించారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

    దూసుకెళ్తున్న ‘వరిసు’ ఫస్ట్ సింగిల్

    ‘వరిసు’ ఫస్ట్ సింగిల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. రీసెంట్‌గా సినిమా ఫస్ట్ సింగిల్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 50 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘బీస్ట్’ సినిమాలోని అరబిక్ కుత్తు సాంగ్ తర్వాత రెండో ఫాస్టెస్ట్ సాంగ్‌గా రంజితమే నిలిచింది. కాగా ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’గా వస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్నా నటించింది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ‘ప్రిన్స్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్

    శివ‌కార్తికేయ‌న్ హీరోగా న‌టిస్తున్న ‘ప్రిన్స్’ మూవీ నుంచి బింబిలికి పిలాపి సాంగ్ రిలీజ్ అయింది. రామ్ మిరియాల‌, రమ్య బెహ్రా, సాహితి చాంగ‌టి క‌లిసి ఈ పాట పాడారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. జాతిర‌త్నాలు ఫేమ్ డైరెక్ట‌ర్ అనుదీప్ కేవీ అ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తెలుగు, త‌మిళ్ ద్విభాషా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఒక ఇండియ‌న్ అబ్బాయి, ఫారిన్ అమ్మాయి మ‌ధ్య జ‌రిగే ల‌వ్‌స్టోరీగా ఈ సినిమా క‌థ తెర‌కెక్కుతుంది. త్వ‌ర‌లో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.