• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘బేబీ’ హీరోయిన్‌కు బంపరాఫర్

    ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు బంపరాఫర్ వచ్చినట్లు సమాచారం. హీరో సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఎస్‌వీసీసీ సంస్థ నిర్మిస్తున్నట్లు టాక్. మరో వైపు ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిశ్ రెడ్డి సరసన ఓ మూవీలో నటిస్తున్నట్లు ఫిలింనగర్ సమాచారం. ఈ చిత్రాన్ని అరుణ్ భీమవరపు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు క్లిక్ అవుతే వైష్ణవి స్టార్ హీరోయిన్‌గా ఎదిగే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

    డ్రగ్స్ కేసులో హీరోయిన్‌కు నోటీసులు

    స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు కొచ్చి NIA అధికారులు నోటీసులు పంపారు. వరలక్ష్మీ పీఏ ఆదిలింగం డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు. అతడికి అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వరలక్ష్మీకి కూడా ఆదిలింగం చాలాసార్లు డ్రగ్స్ అందించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా డ్రగ్స్ అమ్మిన డబ్బులతో సినిమాల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు తేల్చారు. దీంతో ఆమెను విచారించేందుకు NIA అధికారులు విచారణకు పిలిచారు.

    మాజీ భర్తపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

    ‘7/G బృందావన కాలనీ’ హీరోయిన్ సోనియా అగర్వాల్ తన మాజీ భర్త సెల్వ రాఘవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘సెల్వ వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోడు. తనతో వైవాహిక జీవితం అంతంతమాత్రమే. అందుకే విడాకులు తీసుకున్నా. జీవితంలో మళ్లీ తన మొహం చూడను. పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని సెల్వ కుటుంబసభ్యులు బలవంతపెట్టారు. అందుకే కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నా. విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ నటిస్తున్నా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    దగ్గుబాటి రానాపై హీరోయిన్ ఫైర్!

    నటుడు దగ్గుబాటి రానాపై బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ పరోక్షంగా ఫైర్ అయ్యారు. రానాను ఉద్దేశించి సోషల్ మీడియాలో సోనమ్ ఓ పోస్ట్ చేసింది. ‘‘సంకుచిత బుద్ధి ఉన్న వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు. యావరేజ్ మైండ్ ఉన్నవారు సంఘటనల గురించి మాట్లాడతారు. మేథావులు ఆలోచనల గురించి చర్చిస్తారు.’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘కింగ్ ఆఫ్ కోత’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో సోనమ్‌పై రానా పరోక్షంగా విమర్శలు చేశాడు. సోనమ్ షూటింగ్‌లో ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుందని చెప్పాడు.

    రాహుల్ గాంధీని పెళ్లాడుతా: హీరోయిన్

    ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధమని బాలీవుడ్ హీరోయిన్ షెర్లిన్ చోప్రా తెలిపింది. ఇటీవల షెర్లిన్ మీడియాతో మాట్లాడుతూ..‘‘రాహుల్‌కు నచ్చితే వివాహమాడుతా. కానీ ఆయనను వివాహం చేసుకోవడానికి ఓ కండీషన్ ఉంది. పెళ్లి తర్వాత నేను ఇంటి పేరు మార్చుకోను.’’ అంటూ పేర్కొంది. షెర్లిన్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా షెర్లిన్ ప్రస్తుతం పౌరాష్‌పూర్-2 అనే వెబ్‌సీరీస్‌లో నటించింది. ఈ సీరీస్ గత నెల 28న విడుదలైంది.

    అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గా: రాశీ ఖన్నా

    ఓ వ్యక్తితో తాను డేటింగ్ చేయడం వల్ల బరువు తగ్గానని హీరోయిన్ రాశీ ఖన్నా తెలిపింది. ‘‘ఇంతకుముందు థైరాయిడ్‌తో విపరీతంగా బరువు పెరిగా. ఎన్ని వర్కౌట్స్ చేసినా బరువు తగ్గలేదు. ఆఖరికి జిమ్ కోచ్‌ను మార్చినా ప్రయోజనం లేదు. ఆ సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడితో డేటింగ్ మొదలు పెట్టాక బరువు తగ్గాను. స్లిమ్‌గా తయారయ్యాను. అందేంటో నేను అనుకున్న విధంగా మారిపోయా.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఆ వ్యక్తి ఎవరో రాశీ ఖన్నా చెప్పకపోవడం విశేషం.

    నాకు ప్రెగ్నెంట్ కావాలనుంది: హీరోయిన్

    తనకు ప్రెగ్నెంట్ కావాలని ఉందని బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేర్కొంది. ‘‘ప్రెగ్నెంట్ సమయంలో నాకు నచ్చింది తినవచ్చు. అడ్డు చెప్పేవారే ఉండరు. నాకు పుట్టబోయే బిడ్డ ఎవరైనా ఒకటే. ఆడ, మగ ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే చాలు.’’ అంటూ చెప్పుకొచ్చింది. కియారా తన ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. కాగా కియారా ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్‌ఛేంజర్’ చిత్రంలో నటిస్తోంది.

    ఆ హీరో కాళ్లావేళ్లా పడ్డాడు: హీరోయిన్

    తనతో డేటింగ్ చేయాలని ఓ హీరో కాళ్లావేళ్లా పడ్డాడని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపింది. పరోక్షంగా రణ్‌బీర్ కపూర్ పేరు చెప్పకుండానే అతడిని విమర్శించింది. ‘‘ఆ హీరో నా డేటా మొత్తం హ్యాక్ చేశాడు. నేను ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చేవాడు. ఆ హీరోకు నేనంటే పిచ్చి. ఎప్పుడూ నా చుట్టే తిరిగేవాడు. డేటింగ్ చేద్దామని నా కాళ్లావేళ్లా పడ్డాడు. కానీ నేను నో చెప్పాను. దాంతో నన్ను వేధించడం మొదలు పెట్టాడు.’’ అంటూ రణ్‌బీర్ పేరు ప్రస్తావించకుండా కంగనా ఇన్‌స్టాలో స్టోరీ రాసుకొచ్చింది.

    ఆ డైరెక్టర్ కాంప్రమైజ్ కావాలన్నాడు: నటి

    కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి రతన్ రాజ్‌పుత్ తన అనుభవాలు తెలిపింది. ‘‘ముంబైలో ఓ ఆడిషన్‌కు వెళ్లా. అక్కడ ఓ సౌత్ డైరెక్టర్ కండీషన్ పెట్టాడు. హీరో, దర్శకుడు, నిర్మాత, సినిమాటోగ్రాఫర్ వీరిలో ఎవరైనా అడిగితే కాదనకూడదు అంటూ నసుగుతున్నాడు. ముక్కుసూటిగా చెప్పండి అని ప్రశ్నించాను. మీకు తెలిసిందేగా.. వారందరితో మీరు కాంప్రమైజ్ కావాలి అన్నాడు. వెంటనే నేను ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశా. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క సౌత్ మూవీలో కూడా నటించలేదు.’’అంటూ చెప్పుకొచ్చింది.

    బిగ్‌బాస్‌లోకి ‘బేబీ’ హీరోయిన్!

    ‘బేబీ’ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బిగ్‌బాస్‌లోకి అడుగుపెడుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. బేబీ సినిమా హిట్‌తో వైష్ణవి పేరు మోరుమోగుతోంది. దీంతో ఆమె క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బ్యాంకాక్ పిల్ల శ్రావణి, శోభాశెట్టి, సింగర్ మోహన భోగరాజు, అమర్‌దీప్ చౌదరి, తేజస్విని, శ్వేతా నాయుడు, దీపికా పిల్లి, సింగర్ మంగ్లీ, జబర్దస్త్ అప్పారావు, క్రికెటర్ వేణుగోపాలరావు తదితరులు బిగ్‌బాస్ 7లో సందడి చేయనున్నట్లు టాక్.