• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కెనడా ప్రధానిపై జిన్ పింగ్ అసంతృప్తి !

    జీ-20 సమావేశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మధ్య సంభాషణ ఇప్పుడు [వైరల్](url) అవుతోంది. సదస్సు వేదికగా ఇద్దరు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఆ సమాచారం మీడియాలో రావటం పట్ల జిన్ పింగ్ అసహనం వ్యక్తంచేశారు. చర్చలు జరిపే విధానం ఇది కాదంటూ వ్యాఖ్యానించారు. తమ దేశంలో ప్రతిదీ పారదర్శకంగా, నిజాయితీగా ఉండాలని భావిస్తామని..అది కొనసాగిస్తామని ట్రూడో చెప్పారు. కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ, కొన్ని సందర్భాల్లో ఏకాభిప్రాయం కుదరంటూ బదులిచ్చారు. The Cdn Pool cam … Read more

    జీ-20 సదస్సు ప్రారంభం

    ఇండోనేషియాలోని బాలిలో జీ-20 సదస్సు ప్రారంభమయ్యింది.. రెండ్రోజులపాటు నిర్వహించనున్న సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రవంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియా వెళ్లారు. సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో కాసేపు మాట్లాడారు. జీ-20 నాయకులతో సవాళ్లు, వృద్ధి, ఆహారం, పర్యావరణఁ, ఆరోగ్యం, డిజిటల్ మార్పుల గురించి ఆలోచనలు విస్తరిస్తానని మోదీ చెప్పారు.

    ఉత్సాహంగా జోడో యాత్ర

    కాంగ్రెస్‌ పార్టీని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర నాందేడ్‌లోని అర్ధాపూర్‌లో రాహుల్‌ [పాదయాత్ర](url) ప్రారంభించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నడుస్తున్నారు. యాత్రలో భాగంగా ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. భాజపా పాలనలో ఎవ్వరికి మేలు జరగలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని వివరిస్తున్నారు. #WATCH | Congress MP Rahul Gandhi, along with party leaders & workers, resumes the 'Bharat Jodo Yatra' from Ardhapur, … Read more

    ఆలోచింపజేస్తున్న పవన్ స్పెషల్ వీడియో

    సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ స్పెషల్ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఏముందంటే.. ‘‘వందల ఏళ్లు పాలించిన బ్రిటీషర్లను ఇప్పుడు రిషి సునాక్ ఏలుతున్నాడు. అలాంటిది ఏపీలో స్వేచ్ఛగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతున్నాం. నిరంకుశతత్వాన్ని ప్రశ్నించాలి’’ అంటూ ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వీడియో నెటిజన్లను, అభిమానులను ఆలోచింపజేస్తోంది. pic.twitter.com/qGQrRnaIvf — Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022

    కంటతడి పెట్టిన ఎమ్మెల్యే

    ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిస్తేనే కోట్లు సంపాదించుకుంటున్న రోజుల్లో ప్రభుత్వ భవనం ఇచ్చినందుకు ఓ ఎమ్మెల్యే కన్నీరు పెట్టుకున్నారు. బిహార్‌లోని అలౌలి నియోజకవర్గం నుంచి గెలిచిన రామ్‌ వృక్ష్‌…ఇందిరా ఆవాస్‌ యోజన ఇంటిలోనే నిన్నమెున్నటివరకు ఉన్నారు. ప్రభుత్వం ఆయనకు పట్నాలో అధికారిక గృహ సముదాయంలో ఇంటిని కేటాయించగా..తాళాలు అందుకుంటూ [భావోద్వేగానికి](url) లోనయ్యారు. పేదలకు ఏదైనా దొరికిన రోజే వారికి అది దీపావళి అని పేర్కొన్నారు. This is RJD MLA Ram Vriksh Sada from Bihar who just got a house as … Read more

    అడ్వాణీని కలిసిన ప్రధాని మోదీ

    ప్రధాని నరేంద్ర మోదీ భాజపా సీనియర్‌ లీడర్‌ ఎల్‌కే అడ్వాణీని కలిశారు. అడ్వాణీ పుట్టినరోజు పురస్కరించుకొని దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని వెంట కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూాడా వెళ్లారు. ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించారు. అడ్వాణీని మోదీ [కలవటం](url) పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi visited the residence of veteran BJP … Read more

    రాహుల్‌గాంధీపై కాపీరైట్ కేసు

    కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై ఎంఆర్‌టీ మ్యూజిక్ కంపెనీ కాపీ రైట్ కేసు పెట్టింది. రాహుల్ తన ఎలివేషన్ కోసం కేజీఎఫ్2 పాటలు వాడుతున్నారని, ఇది కాపీరైట్ ఉల్లంఘన అవుతుందని అందుకే కేసు పెట్టామని తెలిపింది. రాహుల్‌తో పాటు జైరాం రమేష్, సుప్రియా శ్రీనటేలపై కూడా కేసు పెట్టారు. ఈ మేరకు ఎంఆర్‌టీ సంస్థ బెంగళూరు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కేజీఎఫ్2 పాటలను [వీడియో](url)ల్లో వాడారని తెలుస్తోంది. MRT Music, … Read more

    వైసీపీ గూండల్లారా జాగ్రత్త: పవన్ కళ్యాణ్

    గుంటూరు-ఇప్పంటంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామార్శించేందుకు వచ్చిన పవన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ‘పోలీసుల వ్యవహారతీరుపై పవన్ [ఆగ్రహం](url) వ్యక్తం చేశారు. మార్చిలో ఇప్పంటం ప్రజలు జనసేనకు భూమిస్తే.. ఏప్రిల్‌లో ఇళ్లు కూల్చివేస్తామని నోటీసులిచ్చారు. వైసీపీ గూండాల్లారా జాగ్రత్త. రోడ్డు విస్తరణ చేయడానికి ఇప్పంటం ఏమైనా కాకినాడనా? రాజమండ్రినా? గుంతలు పూడ్చలేరు, రోడ్డు వేయలేరు కానీ గ్రామంలో రోడ్డు విస్తరణనా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటం గ్రామం బయలుదేరిన శ్రీ పవన్ … Read more

    మునుగోడులో పరుగులు తీసిన కేఏ పాల్

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మునుగోడు ఉప ఎన్నిక స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ మునుగోడులో పరుగులు పెట్టారు. పోలింగ్ కేంద్రాల్లోపోలింగ్ సరళిని పరిశీలించి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. నియోజకవర్గంలో బిజీబిజీగా తిరుగుతూ సందడి చేశారు. కాగా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రజలతో కలసి డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, సైకిల్ తొక్కడం వంటి చేష్టలతో నవ్వించారు. #KAPaul also running in the #Munugodu race … Read more

    మునుగోడులో TRS,BJP రాళ్లదాడి

    మునుగోడులో పలివెలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రచారానికి చివరి రోజైన నేడు ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ప్రచారానికి వెళ్లిన ఈటల కాన్వాయ్‌పైనా రాళ్లతో దాడి చేశారు. పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. తన గన్‌మెన్లు, కార్యకర్తలు గాయపడ్డారని, 10-15 కార్లు ధ్వంసం చేశారని అయినా పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని ఈటల ఆరోపించారు. ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామన్నారు.