మెగా కుటుంబం తమ సంక్రాంతి వేడుకులను బెంగళూరులోని ఫామ్ హౌస్లో జరుపుకున్న విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు మెగా-అల్లు కుటుంబాలు పండగ వేడుకల్లో సంతోషంగా గడిపాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, ఒక వీడియోను తాజాగా నాగబాబు కూతురు నిహారిక షేర్ చేసింది.
ఈ వీడియోలో నిహారిక తన వదిన లావణ్య త్రిపాఠితో కలిసి డ్యాన్స్ చేసింది. బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ మూవీలోని తోబా తోబా సాంగ్కి ఆడపడుచులు ఇద్దరూ స్టెప్పులు వేశారు.
ఈ డాన్స్ వీడియోని నిహారిక తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. నిమిషాల వ్యవధిలో ఆ వీడియో వైరల్గా మారింది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. లైక్స్, కామెంట్స్తో హోరెత్తిస్తున్నారు.
తన కజిన్స్ అల్లు శిరిష్ (Allu Sirish), సాయి ధరమ్తేజ్ (Sai Dharam Tej), పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaishnav Tej)తో దిగిన సెల్ఫీని కూడా నిహారిక నెటిజన్లతో పంచుకుంది.
చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా ఆమెతో కలిసి నిహారిక ఫొటో దిగింది. వారి పక్కనే లావణ్య త్రిపాఠి నవ్వుతూ ఫొటోలో కనిపించింది.
మరో ఫొటోలో పంజా వైష్ణవ్ తేజ్తో కలిసి నిహారిక హాఫ్ శారీలో కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, కూతురు అర్హా, నాగబాబు భార్య పద్మజ ముగ్గురూ మెట్లపై కూర్చొని ఒకే ఫ్రేమ్లో కనువిందు చేశారు.
మరో ఫొటోలో మెగా కజిన్స్ నిహారిక, సుస్మిత, శ్రీజ, పవన్ కల్యాణ్ కూతురు ఆద్యా మరికొందరు కజిన్స్తో కలిసి హ్యాపీగా కనిపించారు. ఈ సెల్ఫీ పిక్లో చివరన పంజా వైష్ణవ్ తేజ్ ఆటపటిస్తూ ఫోజు ఇచ్చాడు.
ఈ సంక్రాంతి సెలెబ్రేషన్స్లో కొత్త మెగా కోడలు లావణ్య త్రిపాఠినే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. మెగా ఫ్యామిలిలోని తన ఆడపడుచులతో ఆమె చాలా కలివిడిగా కనిపించింది. అంతా కలసి చాలా గ్రాండ్గా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు.
‘కుటుంబం, సంతోషం రెండూ ఒక్క చోట చేరితే ఇలాగే ఉంటుంది’ అంటూ లావణ్య పెట్టిన కామెంట్ ఆకట్టుకుంటోంది.
ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్లో వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఎక్కడా తమ ప్రేమ గురించి బయట పడకుండా ఎంగేజ్మెంట్ వరకు లావణ్య, వరుణ్ జాగ్రత్త పడ్డారు.