• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రెప్పపాటులో రూ.5 లక్షలు చోరీ

    ఇద్దరు దొంగలు రెప్పపాటులో రూ.5 లక్షలు దొంగతనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నల్గొండ జిల్లా దామరచర్లకు చెందిన రియల్టర్ అజ్మీరా మాలు తన కారులో రూ.5 లక్షలు ఉంచాడు. మిర్యాలగూడలోని ఓ రెస్టారెంట్ వద్ద కారును ఆపి భోజనానికి వెళ్లాడు. ఇంతలో వారిని అనుసరిస్తూ వస్తోన్న ఇద్దరు దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ.5 లక్షల క్యాష్ బ్యాగ్‌తో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1702175983523254665?s=20