• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ ముగ్గురు కలిస్తేనే సినిమాకు విజయం: దిల్ రాజు

    బింబిసార విజయం తెలుగు సినిమాకు తిరిగి ఊపిరిపోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా తర్వాత తెలుగు సినిమా కష్టాల్లో పడిందని అన్నారు. థియేటర్లకు తిరిగి కళ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి విజయం రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఏ సినిమాకైనా డైరెక్టర్, హీరో, నిర్మాత చక్కగా కలిస్తే సినిమా అద్భుత విజయం సాధిస్తుందని బింబిసార మరోసారి నిరూపించిందని దిల్ రాజ్ పేర్కొన్నారు.

    త్వ‌ర‌లోనే షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తాం

    సినిమా షూటింగ్‌ల బంద్ నేప‌థ్యంలో నేడు ఫిల్మ్‌ఛాంబ‌ర్ స‌భ్యులు మ‌రోసారి భేటి అయ్యారు. ఆ త‌ర్వాత మీడియతో మాట్లాడారు. చిత్ర ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నాలుగు క‌మిటీల‌ను ఏర్పాటు చేశాం. ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, నిర్మాణ వ్య‌యాలు, కార్మికుల వేత‌నాల‌పై క‌మిటీలు లోతుగా విశ్లేషిస్తున్నాయి అని తెలిపారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం షూటింగ్‌ల‌ను ఆపేశాం. మా నిర్మాతల‌ మ‌ధ్య ఎటువంటి విభేదాలు లేవ‌ని సి.క‌ళ్యాణ్ తెలిపారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. నాకు వ్య‌క్తిగ‌త అజెండాలేమీ లేవు. షూటింగ్‌లు ఎక్కువ కాలం ఆపే ఉద్దేశం లేదు. … Read more

    ఇక‌పై టిక్కెట్ల ధ‌ర‌లు ఇవే ఉంటాయ‌న్న దిల్‌రాజు

    ప్ర‌ముఖ నిర్మ‌త దిల్‌రాజు నేడు ‘థ్యాంక్యూ’ మూవీ ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతూ టిక్కెట్ల ధ‌ర‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ వంటి న‌గ‌రాల్లో సింగిల్ స్క్రీన్ రూ.150+GST, మ‌ల్టిప్లెక్స్ రూ.200+GST ఉంటుందని చెప్పారు. స్టార్ హీరోల సినిమాలు, భారీ బ‌డ్జెట్ చిత్రాలు మిన‌హాయించి ఇక‌పై అన్ని సినిమాల‌కు టిక్కెట్ ధ‌ర‌లు ఇదేవిధంగా ఉంటాయ‌ని వెల్ల‌డించారు. థ్యాంక్యూ మూవీ జులై 22న రిలీజ్ కానుంది. టిక్కెట్ బుకింగ్స్ ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి.