• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎమోషనల్ అయిన త్రివిక్రమ్

    త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘నువ్వే.. నువ్వే’ ఈ సినిమా విడుదలై 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ చిత్రబృందానికి స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఆనాటి మధురానుభూతులను గుర్తు చేసుకున్నారు. తనకు తొలి అవకాశమిచ్చిన స్రవంతి రవికిశోర్‌ని ఎన్నటికీ మరచిపోనని.. ఆయన పాదాలకు త్రివిక్రమ్ అభివందనం చేశారు. తన మాటలను శ్రద్ధగా వినే ప్రొడ్యూసర్ దొరకడం అదృష్టమని మాటల మాంత్రికుడు అభిప్రాయపడ్డారు.

    వేదికపైనే హీరోపై హీరోయిన్‌ ముద్దుల వర్షం

    త్రివిక్రమ్‌ దర్శకుడిగా పరిచయమైన సినిమా ‘నువ్వే నువ్వే’. తరుణ్, శ్రియ, సునీల్, ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించి అలరించిన ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం సంబరాలు చేసుకుంది. ఆనాటి రోజులకు గుర్తు చేసుకుని చిత్ర యూనిట్ ఎమోషనల్‌ అయింది. హీరోయిన్ శ్రియ అయితే తరుణ్‌తో తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. త్రివిక్రమ్‌ మాటలు, సునీల్‌ కామెడీ టైమింగ్‌తో ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నలిచింది.