• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆసక్తిగా ‘మైఖేల్’ ట్రైలర్

    టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్‌లో సందీప్ లుక్స్, నటన చాలా కొత్తగా ఉన్నాయి. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో సందీప్‌కు జోడీగా దివ్యాంశ కౌశిక్ నటించింది. రంజిత్.జె ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, అనసూయ, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.

    డైరెక్ట‌ర్ ర‌మేశ్ వ‌ర్మ పాన్ ఇండియా మూవీ ప్ర‌క‌ట‌న‌

    ద‌ర్శ‌కుడు ర‌మేశ్ వ‌ర్మ నేడు మ‌రో కొత్త సినిమాను ప్ర‌క‌టించాడు. పూజా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో ఒక పాన్ఇండియా మూవీని తెర‌కెక్కించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. టైటిల్ ‘WHO -Trust no one’ అని ప్ర‌క‌టించారు. దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. న‌టీన‌టులు ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ రాక్ష‌సుడు సీక్వెల్‌గా రాక్ష‌సుడు 2 త్వ‌ర‌లో రానుంద‌ని ఇటీవ‌లే తాజాగా వెల్ల‌డించారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి Blockbuster Director @DirRameshVarma … Read more

    ‘ఓం శ్రీ క‌న‌క‌దుర్గ’ పాన్ఇండియా మూవీ గ్లింప్స్ రిలీజ్

    వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, మేఘ ఆకాశ్, సుమంత్ శైలేంద్ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్న ‘ఓం శ్రీ క‌న‌క‌దుర్గ’ మూవీ గ్లింప్స్ నేడు రిలీజ్ చేశారు. మంచికి, చెడుకి..ప్రేమ‌కు, భ‌యానికి జ‌రిగే యుద్ధ‌మే ఈ క‌థ అని తెలుస్తుంది. షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. లంక శ‌శిధ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాన్ఇండియా మూవీగా ఇది తెర‌కెక్కుతుంది. నెక్స్‌జెన్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.