చంద్రబాబు కోసం ప్రార్థించా: నటి
AP: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రముఖ నటి పూనం కౌర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఆయన జైల్లో ఉండటం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని కలిచి వేసిందని పేర్కొన్నారు. కాగా, ఇవాళ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.