టీ20లకు రోహిత్ పూర్తిగా దూరం?
గత ఏడాది నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉంటున్నాడు. అప్పట్నుంచి హార్దిక్ పాండ్య సారథ్యంలోనే జట్టు ఆడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది T20 ప్రపంచకప్ ఉంది. ఈ క్రమంలో రోహిత్ ఈ దశలో తిరిగి టీ20 జట్టులోకి రావాలని, కుర్రాళ్ల అవకాశాలకు అడ్డంకిగా మారాలని అనుకోవట్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో రోహిత్ చర్చించిన అనంతరం తాను టీ20లకు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నాడని సమాచారం.