• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘మార్క్ ఆంటోని’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్

    విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంటోని’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తమిళంలో ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లను అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 13న ఈ చిత్రం విడుదల కానుంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది.

    ఆ సినిమాకు నో చెప్పడం మంచిదైంది: లారెన్స్

    రాఘవ లారెస్స్ హీరోగా, ఎస్‌జే సూర్య విలన్‌గా కార్తీక్ దర్శకత్వంలో ‘జిగర్తండ డబుల్ ఎక్స్’ చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో నటి నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ఓ థియోటర్‌లో నిర్వహించారు. లారెన్స్ మాట్లాడుతూ.. గతంలో ‘జిగర్తండా’ చిత్రానికి వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పారు. అది వదులుకోవడం వల్లే ఇప్పుడు రూ.100 కోట్లతో రూపొందుతున్న ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని లారెన్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.