• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో నోటిఫికేషన్

    నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఈ నెలాఖరులోగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. ఈ మేరకు ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబరులో రాత పరీక్షలు ఉంటాయి’ అని కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ పేర్కొన్నారు.

    దసరా సెలవుల్లో మార్పులు

    ఏపీలో దసరా సెలవుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసింది. ఈ నెల 24న హాలీడే బదులుగా సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీల్లో సాధారణ సెలవులు ఉండనున్నాయి. దసరా పండుగ దృష్ణ్యా సెలవుల్లో ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది.

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేసింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు అధికారులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదని చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుందని పేర్కొంది. ఆయా శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.