భార్యపై అనుమానంతో దారుణ హత్య
భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా అనంత నగరంలో చోటు చేసుకుంది. స్థానికంగా దంపతులు నారాయణమ్మ(38), AP: నాగరాజులు నివాసం ఉంటున్నారు. నాగరాజు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా భార్యపై అనుమానంతో భర్త తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో నిద్రిస్తున్న భార్యపై రోకలితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో నారాయణమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గాలిస్తున్నారు.