• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి పీటలెక్కిన టాలీవుడ్ హీరో

    టాలీవుడ్ హీరో త్రిగుణ్ ఓ ఇంటి వాడయ్యాడు. నివేదిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. చెన్నైలో బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. కాగా ఆర్జీవీ తెరకెక్కించిన ‘కొండా’ చిత్రంతో త్రిగుణ్ ఫేమస్ అయ్యాడు. తుంగభద్ర, ప్రేమదేశం, పీవీఎస్ గరుడవేగ, కిరాయి, కథ కంచికి.. మనం ఇంటికి, చీకటి గదిలో చితక్కొట్టుడు తదితర సినిమాల్లో త్రిగుణ్ నటించి మెప్పించాడు.

    చెన్నైని ముంచెత్తిన వర్షం

    తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. చెన్నైతోపాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. చైన్నైలోని మీనంబాక్కంలో అత్యధికంగా 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. వాహనాలు, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. చెన్నై నుంచి బయల్దేరాల్సిన 12కుపైగా అంతర్జాతీయ విమనాలు ఆలస్యంగా నడవనున్నాయి. #WATCH | Tamil Nadu | Chennai … Read more

    నయనతార కొత్త బిజినెస్!

    లేడీ సూపర్‌స్టార్ నయనతార కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. భర్త విఘ్నేష్ శివన్‌తో కలసి చెన్నైలోని అగస్త్య థియేటర్‌ను కొనుగోలు చేసినట్లు టాక్. ఈ హాలును 1967లో నిర్మించారు. లాక్‌డౌన్ కారణంగా 2020లో మూసివేశారు. ఇందులో 1000 సీటింగ్ కెపాసిటీ ఉంది. దీనిని రెన్నోవేట్ చేసి మల్టీప్లెక్స్‌గా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఎంజీఆర్, శివాజీ గణేశన్, రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య, విక్రమ్‌లకు సంబంధించిన బ్లాక్‌బస్టర్ సినిమాలు ఈ థియేటర్‌లో ఆడాయి.

    బిర్యానీ ఏటీఎం వచ్చేసింది

    ప్రస్తుతం ఏటీఎం ద్వారా డబ్బులు, బంగారం మాత్రమే డ్రా చేసుకోవచ్చు. కానీ తాజాగా బిర్యానీ ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా చెన్నైలోని కొలత్తూరులో బీవీకే ఈ బిర్యానీ ఏటీఎం ఏర్పాటు చేసింది. ఇది ప్రీమియం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ అందిస్తుంది. ఈ ఏటీఎంలో నిమిషాల్లో వినియోగదారులు ఘుమఘుమలాడే బిర్యానీని పొందవచ్చు. మనకు కావాల్సిన బిర్యానీని స్క్రీన్‌పై ఎంచుకుని డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా స్వైప్ చేసి ఆర్డర్ పొందవచ్చు.

    ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు

    ఏపీలోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి [గుండెపోటు](url)కు గురయ్యారు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు, కార్యకర్తలు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఆయన గుండెలో రెండు వాల్వులు మూసుకుపోయినట్లు డాక్టర్టు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను చెన్నై తరలించారు. కాగా చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. https://www.instagram.com/reel/CoZQ9c2Mwug/?utm_source=ig_web_copy_link

    చెన్నైలో తొలి జీ20 ఎడ్యుకేషన్ మీటింగ్

    తొలి జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌కి చెన్నైలోని మద్రాస్ ఐఐటీ ఆతిథ్యం ఇస్తోంది. ఈ మేరకు ఐఐటీలోని రీసెర్చ్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమావేశానికి వస్తున్న విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు తమిళనాడు సంప్రదాయం ఉట్టిపడేలా ప్రాంగణాన్ని తీర్చి దిద్దారు. అంతేగాకుండా వాలంటీర్లతో కూడిన కళాకారుల బృందాన్ని పురమాయించారు. వారితో ప్రదర్శనలను చేయించనున్నారు. గేటు నుంచి ప్రాంగణం వరకు ఎర్ర తివాచీ పరిచారు. బ్యాండుమేళంతో వారికి ఆహ్వానం పలకనున్నారు. #WATCH | Tamil Nadu: Music and celebrations at IIT-Madras … Read more

    పాకీజా గుర్తుందా.. ప్రస్తుతం తిండి లేక రోడ్డు మీద!

    ఒకప్పుడు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి వాసుకి ప్రస్తుతం దీనస్థితిలో ఉంది. వాసుకి అంటే ఎవరికీ గుర్తు రాదేమో.. పాకీజా అంటే గుర్తుకొస్తుంది. తెలుగునాట పాకీజాగా గుర్తింపు తెచ్చుకున్న వాసుకి ప్రస్తుతం పేదరికంలో మగ్గుతూ ఓ హాస్టల్‌లో కాలం వెళ్లదీస్తోంది. ఆమె దాదాపు 150 సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి స్టార్ల సినిమాల్లో నటించింది. సంపాదించింతా పోగొట్టుకోవడంతో ఆమె సొంతూరు కరైకుడికి వెళ్లిపోయింది. ప్రస్తుతం చెన్నైలో ఓ హాస్టల్‌లో ఉంటోంది.

    కూరగాయలు కొన్న నిర్మలా సీతారామన్

    చెన్నై పర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నిన్న రాత్రి వరకు బిజీబిజీగా గ‌డిపారు. రాత్రి న‌గ‌రంలోని మైలాపూర్ మార్కెట్‌లో కూరగాయలు కొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని వ్యాపారులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బంగాళదుంపలతో పాటు కొన్ని కూరగాయాలను కూడా కొనుగోలుచేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. During her day-long visit to Chennai, Smt @nsitharaman made a halt at Mylapore market where she interacted with the vendors … Read more

    చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్స‌వంలో అద్భుత‌మైన క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు

    44వ చెస్ ఒలింపియాడ్ ఈసారి భార‌త్ ఆతిథ్యం ఇచ్చింది. చెన్నైలో జ‌రుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ను ప్రధాన‌మంత్రి నరేంద్రమోదీ జులై 29న ప్రారంభించారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా చెస్ బోర్డు లాంటి స్టేజీపై త‌మిళనాడు సాంప్ర‌దాయ నృత్య క‌ళారీతుల‌తో అల‌రించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారుతున్నాయి. మొత్తం 187 దేశాల ప్లేయ‌ర్స్ ఇందులో పాల్గొంటారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. https://twitter.com/TheFigen/status/1553825769113141248?s=20&t=TXNQrrM9bG2PGzl0GZy9ow