• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడీ కీవీస్- నెదర్లాండ్ ఢీ

    వరల్డ్‌ కప్‌లో భాగంగా నేడు ఉప్పల్‌ వేదికగా కివీస్ – నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్‌కు నెదర్లాండ్‌తో పోరు తేలికనే చెప్పవచ్చు. కివీస్ బ్యాటర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ న్యూజిలాండ్ బలంగా ఉంది. అయితే పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్ గొప్పగా పోరాడింది.

    రేపటి నుంచే వరల్డ్ కప్ సమరం

    క్రికెట్ అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్ క్రికెట్ సమరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నర్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈనెల 5 నుంచి నవంబర్ 19 వరకు టోర్నీ జరగనుంది. మొత్తం పది జట్లు రౌండ్ రాబిన్ విధానంలో ఆడుతాయి. అంటే ఒక్కో జట్టు మిగతా 9 జట్లతో తలపడతాయి. లీగ్ దశ తర్వాత మొదటి 4 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.

    సచిన్‌కు అరుదైన గౌరవం

    భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను వన్డే ప్రపంచకప్ 2023 గ్లోబల్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. అక్టోబర్ 5 నుంచి ఇండియాలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ప్రపంచకప్ టోర్నీతో కనిపించనున్నాడు. ఈనెల 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో వరల్డ్ కప్ ట్రోఫీతో మైదానంలోకి అడుగు పెట్టనున్నాడు. దీంతో అధికారికంగా టోర్నీ ఆరంభమవుతోంది. సచిన్‌తో పాటు గ్లోబల్ అంబాసిడర్లుగా ఇయాన్ మోర్గాన్, ఏబీ డివిలీయర్స్ ఇతర మాజీ క్రికెట్లను ఐసీసీ ప్రకటించింది.