• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    నేడు ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసు, అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. అటు ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై కూడా విచారణ జరగనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    సీఐడీ విచారణకు లోకేష్

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. 10 గంటలకు విచారణ ప్రారంభమైంది. హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ చేంజ్ చేశారని లోకేష్‌పై సీఐడీ అభియోగాలు మోపింది. రాష్ట్ర విభజనకు ముందు హెరిటెజ్ సంస్థ రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో 9 ఎకరాలు ల్యాండ్ కొంటే అవినీతి ఎలా అవుతుందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగనుంది.