• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఫ్యాన్స్ హంగామా

    పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’ మూవీని 4K వెర్షన్‌లో నేడు రీరిలీజ్ చేశారు. ఈ సందర్బంగా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు. సింగిల్ స్క్రీన్ మాదిరి స్క్రీన్ వద్దకి వెళ్లి డ్యాన్స్ చేశారు. తొలిప్రేమ విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీని రీరిలీజ్ చేశారు. అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్ మూవీ ఇది. #TholiPrema4K IN CINEMAS NOW? Multiplexes turned into Single Screens … Read more

    ‘మోసగాళ్లకు మోసగాడు’ 4K ట్రైలర్ రిలీజ్

    దివంగత సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. మే 31న కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీని 4K వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆవిష్కరించారు. ఈ ట్రైలర్‌కు ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి సానుకూల స్పందన వస్తోంది. కాగా ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 1971 విడుదలై ఘనవిజయం సాధించింది. సత్యనారాయణ, ప్రభాకర్, గుమ్మడి, జ్యోతిలక్ష్మీలు నటించారు.

    ఆరెంజ్ రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?

    మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, జెనీలియా జంటగా నటించిన ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌లోనూ దుమ్మురేపింది. ఈ చిత్రం రీ రిలీజ్‌కు ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమా 3 రోజుల్లో 2.12 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. రీ రిలీజ్ అయిన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా ఈ మూవీ టాప్ 5లో చోటు నిలిచింది. ‘ఆరెంజ్’ సినిమా 2010లో విడుదలైంది. ఈ మూవీలో నాగబాబు, ప్రకాశ్ రాజ్, షాజాన్ పదామ్సీ, సంచిత శెట్టి, వెన్నెల కిశోర్‌లు కీలకపాత్రలు పోషించారు. భాస్కర్ దర్శకత్వం వహించారు. నాగబాబు … Read more

    తెలుగు రాష్ట్రాల్లో ‘ఒక్కడు’ మేనియా

    సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, భూమిక హీరోయిన్‌గా నటించిన ‘ఒక్కడు’ మూవీని 4Kలో రీ రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడు సినిమా ప్రదర్శిస్తున్నథియేటర్ల వద్ద మహేష్ అభిమానులు [సందడి](url) చేస్తున్నారు. బైక్ ర్యాలీలు చేస్తూ కోలాహలంగా ఉన్నారు. కాగా ‘ఒక్కడు’ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2003లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 8 నంది అవార్డులను కొల్లగొట్టింది. గుణశేఖర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. At pratap theatre, … Read more