• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టేజ్‌పైనే భోరున ఏడ్చేసిన హీరోయిన్

    అశ్విన్ బాబు, నందితా శ్వేతా జంటగా నటించిన ‘హిడింబ’ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో హీరోయిన్ నందితా శ్వేతా స్టేజీపైనే భోరున ఏడ్చేసింది. ‘‘హిడింబను అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ మూవీలో సీరియస్ రోల్ చేస్తానని అనుకోలేదు. కానీ నాపై నమ్మకముంచి డైరెక్టర్ అనిల్ ఈ క్యారెక్టర్ ఇచ్చారు. హీరో, డైరెక్టర్ వల్లే నా పాత్రకు న్యాయం చేశా. వాళ్ల సపోర్ట్ మర్చిపోలేనిది.’’ అంటూ ఎమోషనల్ అయ్యింది.

    కుప్పకూలిన టీడీపీ స్టేజ్

    తెలుగుదేశం పార్టీ మీటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. ఏలూరు జిల్లా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో టీడీపీ ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఈదురుగాలులు రావడంతో వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. వేదికపై ప్రసంగిస్తున్న మాజీ హోంమంత్రి చినరాజప్ప, చింతమనేని ప్రభాకర్‌లకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు నాయకులను పైకి లేపారు. కుప్పకూలిన టీడీపీ స్టేజ్ ఏలూరు – నూజివీడులో టిడిపి భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య యాత్రలో అపశృతి. ఈదురుగాలులు, భారీ వర్షం రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిన స్టేజ్. … Read more