• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భర్త చేతిలో మహిళా కానిస్టేబుల్‌ హత్య

    బిహార్‌ రాజధాని పాట్నాలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను కట్టుకున్న భర్తనే దారుణంగా కాల్చి చంపాడు. ఉద్యోగం వల్ల ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం లేదన్న కోపంతో ఆమె హత్య చేశాడు. జెహనాబాద్‌కు చెందిన గజేంద్ర యాదవ్‌కు ఆరేళ్ల క్రితం శోభాకుమారి (23)తో పెళ్లి జరిగింది. శోభ ఇటీవలే పోలీసు కొలువులో చేరింది. ఉద్యోగంతో బిజీగా మారిన ఆమెతో గజేంద్ర తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుక్‌ చేసిన హోటల్‌ గదికి పిలిపించి భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv