• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రామ్‌ చరణ్‌కు అమిత్ షా సన్మానం

    మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సత్కరించారు. RRRలో నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేశానికే గర్వకారణమని కొనియాడారు. షాలువా కప్పి అభినందించారు. ఆస్కార్ వేడుకల అనంతరం అమిత్ షా ఆహ్వానం మేరకు చిరంజీవితో కలిసి ఆయన షా నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    భారీగా పెరిగిన బంగారం ధర

    తెలుగురాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ. 53,800కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.270 పెరిగి 58,690కి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 73,100కు చేరింది. అటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం; 6 మంది దుర్మరణం

    ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 మంది దుర్మరణం పాలయ్యారు. బత్తలపల్లి మండలం పోట్లపర్రి వద్ద బొలెరో, ఆటో ఎదురెదురుగా వేగంగా వస్తూ బలంగా ఢీకొన్నాయి. దీంతో స్పాట్‌లోనే 5 మంది మృత్యువాత పడగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

    బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి; తెగిపడిన వేలు

    [వీడియో;](url) ఓ కొబ్బరి బోండాల వ్యాపారి బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ అధికారి వేలు తెగి కిందపడింది. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో చోటుచేసుకుంది. ఓ వ్యాపారి వ్యానులో కొబ్బరిబోండాలు అమ్ముతున్నాడు. అదే సమయంలో బ్రేక్ ఇన్‌స్పెక్టర్ వచ్చి అతడిని ఫిట్‌నెస్ పత్రాలు అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన వ్యాపారి కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో ఆర్టీఓపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో అతడి వేలు తెగి కిందపడిపోయింది. … Read more

    TSPSC ప్రశ్నాపత్రం లీకేజీకి కారణం ఈమెనే!

    TSPSC ఏఈ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో గురుకుల ప్రిన్సిపాల్ రేణుక మాస్టర్ మైండ్‌గా పోలీసుల విచారణలో తేలింది. ఆమె తన తమ్ముడి కోసం ప్రశ్నాపత్రం కావాలని ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకుంది. రూ.10లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది. ట్విస్ట్‌ ఏమిటంతే రేణుక తమ్ముడు చదివింది టీటీసీ. ఏఈ పరీక్షకు అర్హుడు కాదు. ప్రవీణ్ పంపిన ప్రశ్నాపత్రాన్ని రూ.14లక్షల చొప్పున రేణుక నీలేష్, గోపాల్ అనే అభ్యర్థులకు అమ్మినట్లు తెలిసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే నిందితులను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. టీఎస్‌పీఎస్సీలో … Read more

    రూ.3000ల పింఛన్..నా ఎకానమిక్స్ ..నా పాలిటిక్స్‌.. జగన్ స్పీచ్‌ హైలైట్స్‌

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జనవరి నాటికి పింఛను రూ. 3000 చేశాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కులం, వర్గం, మతం అనేది చూడకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తామని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అయిపోయాక అందరూ నావాళ్లే అనడానికి ఈ నాలుగేళ్ల పాలన నిదర్శనమన్న సీఎం… గాల్లో మాటలు… గ్రాఫిక్స్‌ మాయాజాలం చూపించబోను ఇదే నా ఎకనామిక్స్, పాలిటిక్స్‌ అంటూ రెండో రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చారు.  రూ.3000 పింఛన్ … Read more

    దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు!

    ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17, 24, 31 తేదీల్లో (శుక్రవారం) నడపనున్నట్లు ప్రకటించింది. తిరుపతి -సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో (ఆదివారం) నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లకు గతంలోని స్టాపేజ్ లు, టైమింగ్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అటు సికింద్రాబాద్-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో … Read more

    మళ్లీ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది; ఉపేంద్ర

    పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’ తో మార్చ్‌ 17న ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు ఉపేంద్ర. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రిలీజ్ ఫంక్షన్‌ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉందన్న ఉపేంద్ర.. తన పాత సినిమాల్లోని డైలాగ్స్‌తో అలరించాడు. అలాగే ఆస్కార్‌ గెలుచుకున్న RRR చిత్రబృందానికి శుభాకాంక్షలు చెప్పాడు.

    TS; సర్పంచ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లైంగిక వేధింపులు

    [వీడియో;](url) స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపెల్లి నవ్య ఆరోపించారు. తనపై మనసు పడ్డానంటూ మరో బీఆర్ఎస్ మహిళా నేతతో రాయబారం పంపారని ఆమె చెప్పారు. ఎమ్మెల్యేతో బయటికి వెళ్తే డబ్బు, బంగారం, పిల్లల చదువులకు అయ్యే ఖర్చు తనే భరిస్తాడని రాయబారం పంపినట్లు తెలిపారు. తననే కాదు మరికొందరు మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. While #BRS MLC Kavitha Kalvakuntla is protesting … Read more

    ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!

    ఏపీ: బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు అడుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలు, పెన్షన్లపై అనిశ్చితి పెంచేందుకు మార్చి నెల బిల్లులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నిరసన స్వరం మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వద్ద 95 డిమాండ్లు ఉండగా.. అందులో వేతనాల అంశం ఒక్కటే తెరపై ఉండేలా ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. అయితే, మార్చి నెలలో బిల్లులు పెట్టడం వల్ల సీరియల్ నంబర్ 2022 ఆర్థిక సంవత్సరం కింద … Read more