• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు ఆసీస్‌తో భారత్ తొలి టీ20

    నేడు ఆసీస్‌తో భారత్ విశాఖలో తొలి టీ20 మ్యాచ్ అడనుంది. పంచకప్‌లోని భారత్‌ జట్టులో ఉన్న వాళ్లలో.. ఇప్పుడు సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ మాత్రమే ఈ సిరీస్‌ ఆడబోతున్నారు. ఇంకో ఆరు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఈ సిరీస్‌లో సత్తాచాటాలని ఆటగాళ్లు చూస్తున్నారు. ఈ టీ20లో భారత జట్టులో ఇషాన్‌ (వికెట్‌కీపర్‌), యశస్వి, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, రింకు సింగ్‌, అక్షర్‌/సుందర్‌, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌/అవేష్‌, ముకేశ్‌ ఉన్నారు.

    టీ20లకు రోహిత్ పూర్తిగా దూరం?

    గత ఏడాది నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు దూరంగా ఉంటున్నాడు. అప్పట్నుంచి హార్దిక్‌ పాండ్య సారథ్యంలోనే జట్టు ఆడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది T20 ప్రపంచకప్‌ ఉంది. ఈ క్రమంలో రోహిత్‌ ఈ దశలో తిరిగి టీ20 జట్టులోకి రావాలని, కుర్రాళ్ల అవకాశాలకు అడ్డంకిగా మారాలని అనుకోవట్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో రోహిత్ చర్చించిన అనంతరం తాను టీ20లకు దూరంగా ఉండాలని రోహిత్‌ నిర్ణయించుకున్నాడని సమాచారం.

    ఆసీస్‌తో టీ20లకు కెప్టెన్‌గా సూర్య

    ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు జట్లును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌. పేర్లను వెల్లడించింది.

    ‘జట్టును గెలిపించడం రోహిత్‌కు తెలుసు’

    భారత్, ఆసీస్‌ రేపు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మపై టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ జహీర్‌ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ‘అతడు బ్యాటింగ్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ఎన్నోసార్లు ఫైనల్‌ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం రోహిత్‌కు ఉంది. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి బాగా తెలుసు’. అని జహీర్ చెప్పుకొచ్చాడు.

    ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, రిచర్డ్‌ మార్లెస్‌

    రేపు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తున్నారు. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారత వాయుసేన ఆధ్వర్యంలోని సూర్యకిరణ్‌ ఎయిరోబాటిక్‌ బృందం విన్యాసాలు చేయనుంది. టాస్‌కు ముందు ముంబయికి చెందిన 500 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. స్టేడియంలో లక్షా 30 వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది.

    టీ20లకు కెప్టెన్‌గా సూర్య?

    ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్‌ పాండ్య కోలుకోకపోవడంతో సూర్యకు పగ్గాలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆసీస్‌తో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ ఈనెల 23న విశాఖపట్నంలో ఆరంభమవుతుంది.

    దక్షిణాఫ్రికా ఓటమి.. కెప్టెన్‌పై విమర్శలు

    వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడింది. అప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన సౌతాఫ్రికా సెమీస్ కీలకమైన నాకౌట్ పోరులో మాత్రం చేతులెత్తేసింది. అయితే సెమీస్‌లో సౌతాఫ్రికా ఓటమికి ఆ జట్టు కెప్టెన్ టెంబా బవూమానే కారణమని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బ్యాటింగ్‌లో విఫలం, కెప్టెన్సీలో ప్రభావం చూపలేకపోతున్నాడని విమర్శలు చేస్తున్నాయి. దీంతో జట్టుకు భారమయ్యాడని విమర్శిస్తున్నారు.

    AUS vs SA: దక్షిణాఫ్రికా స్వల్ప స్కోరు

    వరల్డ్‌కప్‌ రెండో సెమీస్‌లో ఆసీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 212-10 (49.4) స్వల్ప స్కోరు చేసింది. ఓ దశలో 24-4 (11.5) స్కోరుతో ఉన్న దక్షిణాఫ్రికాను క్లాసెన్‌ (47), మిల్లర్‌ (101) జోడీ కాపాడింది. వీరిద్దరు 90కి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్లాసెన్‌ ఔటైన తర్వాత మిల్లర్‌ మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. అద్భుతమైన శతకంతో చివరి వరకూ పోరాడాడు. జట్టు స్కోరును 200 మార్క్‌ను దాటించాడు. మిల్లర్ వల్లే SA ఆమాత్రం స్కోరైన చేయగల్గింది. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 3, కమ్మిన్స్‌ 3, హేజిల్‌వుడ్‌ … Read more

    టాస్‌ గెలిచి సౌతాఫ్రికా బ్యాటింగ్

    వన్డే వరల్డ్‌కప్‌ భాగంగా నేడు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌-2లో తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట సౌతాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డికాక్(వికెట్‌కీపర్‌), టెంబా బవుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కొయెట్జీ, కగిసో రబడ, తబ్రేజ్ షంషి ఆస్ట్రేలియా జట్టు: ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లబూషేన్‌, గ్లెన్ … Read more

    50 సెంచరీలు.. కోహ్లీపై సినీ ప్రముఖుల ప్రశంసలు

    న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక 50 శతకాలు నమోదు చేసి కోహ్లీ, సచిన్‌ తెందూల్కర్‌ రికార్డును అధిగమించాడు. దీనిపై సినీ ప్రముఖులు స్పందిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా కోహ్లీకి శుభాకాంక్షలు తెలిపారు. అగ్ర దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్‌, సాయిధరమ్‌ తేజ్‌, వెంకటేష్‌లతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థలు ట్వీట్ చేస్తూ కోహ్లీని ప్రశంసించాయి.