• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • IPL 2024: సంచలనాలు ఉన్నా.. ఐపీఎల్‌పై ఫ్యాన్స్‌లో అసంతృప్తి.. ఎందుకంటే?

    గత సీజన్లతో పోలిస్తే 17వ ఐపీఎల్‌ సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. ముఖ్యంగా బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ప్రతీ బంతిని స్టాండ్స్‌లోకి తరలిస్తూ క్రికెట్‌ ప్రియులకు అసలైన మజాను అందిస్తున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ నమోదైన టాప్‌-10 అత్యధిక స్కోర్లలో ఏనిమిది ఈ సీజన్‌లోనే వచ్చాయంటే ఏ స్థాయిలో బ్యాటర్లు విరుచుకుపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. బ్యాటింగ్‌ వరకూ అంతా బాగానే ఉన్నా మిగత విషయాల్లో మాత్రం ఈ సీజన్‌ ఐపీఎల్‌ ప్రియులను నిరాశ పరుస్తోంది. ఆశించిన స్థాయిలో మెప్పించలేక వారి అసంతృప్తికి కారణమవుతోంది. … Read more

    EXCLUSIVE: ఐపీఎల్‌ 2024లో చుక్కలు చూపిస్తున్న కుర్రాళ్లు.. టీమిండియాకు సెలక్ట్ అయ్యేది వీళ్లేనా?

    సాధారణంగా ఐపీఎల్‌ అంటే ముందుగా స్టార్‌ క్రికెటర్లే గుర్తుకు వస్తారు. విరాట్‌ కోహ్లీ (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma), సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav), జస్ప్రిత్‌ బుమ్రా (Jasprit Bumrah), హార్దిక్ పాండ్యా (Hardik Pandya) లాంటి టీమిండియా ప్లేయర్లతో పాటు విదేశీ ఆటగాళ్లను చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే ప్రస్తుత సీజన్‌లో కొందరు యువ క్రికెటర్లు.. స్టార్‌ ప్లేయర్లను మరిపిస్తూ సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తో అద్భత ఆట తీరును ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అక్టోబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌ … Read more

    IPL 2024: టాప్‌ 4లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. ఆ ఒక్కటి అదిగమిస్తే కప్‌ మనదే!

    ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌’ (Sunrisers Hyderabad) జట్టు అదరగొడుతోంది. గత కొన్ని సీజన్ల నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానాలకే పరిమితమైన SRH.. కొత్త కెప్టెన్‌ ప్యాట్ కమ్మిన్స్‌ (Pat Cummins) రాకతో సత్తా చాటుతోంది. తన బలహీనతలను బలాలుగా మార్చుకొని ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌.. మూడు విజయలతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది. 2022 ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత SRH ఇలా టాప్‌-4లో నిలవడం ఇదే తొలిసారి. ఆ సీజన్‌లో … Read more

    IPL 2024: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. సీజన్‌ మెుత్తానికి దూరమవుతున్న స్టార్‌ ప్లేయర్లు వీరే!

    క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్‌ (IPL 2024) మెగా సమరం సిద్ధమవుతోంది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న 17వ సీజన్‌ కోసం అన్ని జట్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాయి. టైటిలే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని జట్లకు కొత్త సారథులు వచ్చారు. అయితే కొంతమంది స్టార్ ప్లేయర్లు వివిధ కారణాల వల్ల సీజన్‌ మెుత్తానికి దూరమవుతున్నారు. మరికొందరు పాక్షికంగా కొన్ని ఆటలకు అందుబాటులో ఉండటం లేదు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.  మహ్మద్‌ షమీ (Mohammed Shami) ఐపీఎల్‌లో ‘గుజరాత్‌ టైటాన్స్‌’ (Gujarat … Read more

    Vamshhi Krrishna: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన ఆంధ్ర క్రికెటర్.. ఎలా కొట్టాడంటే..!

    ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరుగుతున్న కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ (Col CK Nayudu Trophy)లో ఆంధ్రా బ్యాటర్‌ వంశీ కృష్ణ(Vamshhi Krrishna) విధ్వంసం సృష్టించాడు. రైల్వే జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రైల్వే జట్టు బౌలర్‌ దమన్‌దీప్‌ సింగ్‌ వేసిన ఓవర్‌లో ప్రతీ బంతిని సిక్స్‌గా మలిచిన వంశీ కృష్ణ.. ఆ ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 64 బంతుల్లో 110 రన్స్‌తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. … Read more

    రంజీ గెలిస్తే ఆటగాళ్లకు BMW కార్లు: HCA

    రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. దీంతో పాటు రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే టీంకు రూ.కోటి, ప్రతి ప్లేయర్‌కు బీఎండబ్ల్యూ కారు బహుకరిస్తామని వెల్లడించారు. ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డికి తలో రూ.50 వేలు ప్రత్యేక నగదు … Read more

    ఆసీస్‌తో టీ20లకు కెప్టెన్‌గా సూర్య

    ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు జట్లును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, తిలక్‌ వర్మ, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేష్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌. పేర్లను వెల్లడించింది.

    ‘జట్టును గెలిపించడం రోహిత్‌కు తెలుసు’

    భారత్, ఆసీస్‌ రేపు టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మపై టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్ జహీర్‌ఖాన్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ‘అతడు బ్యాటింగ్‌లోనూ దూకుడు చూపిస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నాడు. ఎన్నోసార్లు ఫైనల్‌ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం రోహిత్‌కు ఉంది. జట్టును ఎలా ముందుకు నడిపించాలో అతడికి బాగా తెలుసు’. అని జహీర్ చెప్పుకొచ్చాడు.

    ఫైనల్ మ్యాచ్‌కు మోదీ, రిచర్డ్‌ మార్లెస్‌

    రేపు భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వస్తున్నారు. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారత వాయుసేన ఆధ్వర్యంలోని సూర్యకిరణ్‌ ఎయిరోబాటిక్‌ బృందం విన్యాసాలు చేయనుంది. టాస్‌కు ముందు ముంబయికి చెందిన 500 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు. స్టేడియంలో లక్షా 30 వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది.

    టీ20లకు కెప్టెన్‌గా సూర్య?

    ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్‌ పాండ్య కోలుకోకపోవడంతో సూర్యకు పగ్గాలు అప్పగించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆసీస్‌తో అయిదు మ్యాచ్‌ల సిరీస్‌ ఈనెల 23న విశాఖపట్నంలో ఆరంభమవుతుంది.