అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బైడెన్ దంపతులు ఇచ్చిన ఆతిథ్యాన్ని మోదీ స్వీకరించారు. ఈ క్రమంలో పురాతన అమెరికన్ బుక్ గ్యాలీతో పాటు పాతకాలపు అమెరికన్ కెమెరాను మోదీకి బైడెన్ బహూకరించారు. మరోవైపు జిల్ బైడెన్కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారు. అనంతరం ఇరువురూ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. వైట్హౌస్లో ప్రవేశించే ముందు బైడెన్ దంపతులు, మోదీ ఫొటోలకు పోజులిచ్చారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/06/22084727/image-1367.jpeg)