సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు మెుదలవుతుందోనని అటు మహేష్ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. కాగా, ప్రస్తుతం ‘SSMB29’ చిత్రానికి సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయి. ఈ వర్స్క్లోనే మూవీలో మహేష్ లుక్ ఏ విధంగా ఉండాలన్న డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
మహేష్ లుక్ అదేనా?
‘SSMB 29’లో మహేష్ లుక్ ఎలా ఉండనుందన్న క్యూరియాసిటీ ప్రస్తుతం అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్ షేర్ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మహేష్ తన ఇన్స్టాగ్రామ్లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫోటోని షేర్ చేశాడు. ఆ పిక్లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మహేష్ కోసం 8 లుక్స్ డిజైన్!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. తన సినిమాల్లోని హీరోల లుక్ విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. కథకు తగ్గట్టుగా హీరో లుక్ను మెయిన్టైన్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న పేరు ఇండస్ట్రీలో ఉంది. ఇందుకు అనుగుణంగానే తన అప్కమింగ్ మూవీ ‘SSMB29‘లోనూ మహేష్ లుక్పై రాజమౌళి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. మహేష్ పాత్రకు సంబంధించి ఎనిమిది లుక్ డిజైన్స్ను ఆయన సిద్ధం చేశారట. వాటిని స్కెచ్ రూపంలోకి మార్చి అందులో ఏది మహేష్కు బాగా సెట్ అవుతుందో రాజమౌళి దగ్గరుండి పరిశీలిస్తున్నారట. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే మహేష్ లేటెస్ట్ లుక్ బయటకు రావడం ఆసక్తిని పెంచింది.
కృష్ణుడి గెటప్లో మహేష్!
రాజమౌళి ఆ ఎనిమిది లుక్స్కు సంబంధించి మహేష్తో ఫొటోషూట్ కూడా నిర్వహించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆ ఎనిమిది లుక్స్లో కృష్ణుడి గెటప్ కూడా ఉందట. ఇటీవల మహేష్ను కృష్ణుడి గెటప్లో షూట్ కూడా చేశారని సమాచారం. ఆ లుక్ మహేష్కు మాటల్లో చెప్పలేనంత బాగా కుదిరిందని అంటున్నారు. మహేష్ను కృష్ణుడి గెటప్లో చూసి చిత్ర యూనిట్ ఎంతగానో మురిసిపోయిందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
200 మందితో ప్రీ ప్రొడక్షన్ పనులు!
ప్రస్తుతం రాజమౌళి తన 200 మంది బృందంతో ప్రీ ప్రొడక్షన్, స్కెచ్, లుక్ టెస్ట్ నిర్వహిస్తున్నారట. సినిమా ప్రారంభం కాకముందే 200 మంది టీమ్ అంటే సెట్స్ పైకి వెళ్లాక ఇంకెంత మంది పని చేస్తారోనని ఫిల్మ్ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. కాగా, ‘SSMB29’ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ చిత్రమని ప్రచారం జరుగుతోంది. ఇండియానా జోన్స్ తరహాలో హాలీవుడ్ మేకర్స్తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు ఇటీవల వార్తలు సైతం వచ్చాయి.
‘చెల్సియా ఎంత ఫేమస్సో తెలుసా?
అమెరికన్ – ఇండోనేషియా నటిగా బ్యూచెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్కి మంచి గుర్తింపు ఉంది. ‘చెల్సియా ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జాతీయ స్థాయిలో ప్రెస్మీట్!
‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్మీట్ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘SSMB29’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్మీట్ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్ ఆలోచిస్తోందట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలోనే తెలియనుంది.