• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేష్‌బాబు అరుదైన రికార్డు; సౌత్ ఇండియాలోనే?

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు సోషల్ మీడియాలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌ మూడింట్లో 10 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన ఏకైక సౌత్ సెలబ్రిటీగా నిలిచాడు. తాజాగా మహేష్ ఇన్‌స్టాలో 10 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అంతకు ముందు ఫేస్‌బుక్, ట్విటర్‌లలో 10 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాగా మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ 28’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

    SSMB28 మూవీ రిలీజ్ అప్పుడేనా?

    త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలో ‘SSMB28’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాపై ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ‘దసరా’ పండుగ బరిలో నిలపాలని నిర్మాత రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆగస్టులో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కానీ, ఆగస్టు 11న చిరంజీవి భోళాశంకర్ విడుదల తేదీని ఖాయం చేసుకుంది. దీంతో సంక్రాంతికి వాయిదా వేయాలని మేకర్స్ యోచించారట. కానీ, దసరాకు విడుదల చేసేందుకు తాజాగా నిర్ణయించుకున్నట్లు టాక్.

    మహేశ్‌ని ఇరకాటంలో పెట్టిన చిరంజీవి!

    మహేశ్‌బాబును చిరంజీవి ఇరకాటంలో పెట్టారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ‘SSMB28’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి కొత్త సమస్య ఎదురవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న ‘భోళాశంకర్’ మూవీ ఆగస్టు 11న విడుదల కానుంది. వాస్తవానికి ఇదే షెడ్యూలుకి మహేశ్ సినిమాను విడుదల చేయాలని తొలుత నిర్ణయించారు. భోళాశంకర్ విడుదల తేదీ ప్రకటనతో నిర్మాత రాధాకృష్ణ సందిగ్ధంలో పడ్డారట. మరి, విడుదలను వాయిదా వేస్తారా? అదే తేదీన రిలీజ్ చేస్తారా? అనే అంశంపై క్లారిటీ … Read more

    రాజమౌళి, మహేశ్ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్?

    మహేశ్‌ బాబుతో తీయబోయే సినిమాను రాజమౌళి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు. గ్లోబల్ రేంజ్ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మేరకు హాలీవుడ్ టెక్నిషియన్స్‌తో పనిచేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. మహేశ్ సరసన హాలీవుడ్ హీరోయిన్‌ని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు ఇక ముగిసిపోయిన నేపథ్యంలో జక్కన్న మహేశ్ సినిమాపై దృష్టి సారించనున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించనున్నారు. © ANI Photo Screengrab … Read more

    ఉగాదికి SSMB28 టైటిల్ అనౌన్స్‌మెంట్?

    సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా వడివడిగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా టైటిల్‌ని ఉగాదికి అనౌన్స్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా టైటిల్ కూడా ‘అ’ అనే అక్షరంతోనే మొదలు కావాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారట. అతడే పార్ధు, అర్జునుడు, అమ్మ కథ.. ఇలా పలు టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. రాధాకృష్ణ … Read more

    హోటల్‌లో తళుక్కుమన్న మహేశ్‌ దంపతులు

    హైదరాబాద్‌లోని ‘ఏఎన్‌ పాలెస్‌ హైట్స్‌’ హోటల్‌లో హీరో మహేష్‌బాబు దంపతులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను శ్రేయాస్‌ మీడియా ట్విటర్‌లో పోస్టు చేసింది. హోటల్‌లో మహేశ్‌ దంపతులు విందు ఆరగించడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్‌ రాకతో తమ హోటల్‌ ఖ్యాతి మరింత పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్, నమ్రతాలతో పాటు, డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి సైతం హోటల్‌లో విందు చేశారు. Courtesy Twitter:@shreyasgroup Courtesy Twitter:@shreyasgroup Courtesy Twitter:@shreyasgroup Courtesy Twitter:@shreyasgroup

    ‘SSMB28’లో కీలకంగా సిస్టర్ సెంటిమెంట్?

    మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ‘SSMB28’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ప్రధాన కథాంశంగా సాగనుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ పాత్ర కోసం పవర్‌ఫుల్ నటిని వెతుకుతున్నట్లు టాక్ నడుస్తోంది. అలనాటి నటి రేఖను ఈ పాత్ర కోసమే సంప్రదించినట్లు సమాచారం. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది.

    ‘SSMB28’లో అలనాటి నటి రేఖ?

    త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం అలనాటి నటి రేఖను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈమె సినిమాల్లో చేసి చాలా కాలమైంది. అయితే, త్రివిక్రమ్ పాత్రను వివరించడంతో సినిమాకు రేఖ ఒకే చెప్పేసినట్లు టాక్. ‘SSMB28’ వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

    మహేశ్ బాబు, ఏఆర్ రెహమాన్ ఒకే ఫ్రేములో..!

    సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్ అనంతరం ఓ ప్రైవేట్ హోటల్‌లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఏఆర్ రెహమాన్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి దిగిన సెల్ఫీ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహేశ్‌తో దిగిన ఫొటోను రెహమాన్ షేర్ చేశాడు. ఈరోజు జరిగిన ఫేర్‌వెల్ మ్యాచ్‌కి కేంద్రమంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సానియాను కిరణ్ రిజిజు అభినందించారు. ఎల్బీ స్టేడియంలో సానియా ఫేర్‌వెల్ మ్యాచ్ జరిగింది.

    ముగ్గురు హీరోలు కలిసి హైదరాబాద్‌లో డ్రైవ్‌-ఇన్ థియేటర్‌

    హైదరాబాద్‌లో తొలి డ్రైవ్‌-ఇన్ థియేటర్ రాబోతోంది. ఆసియన్‌ క్లాసిక్ పేరుతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దీనిని నిర్మించబోతున్నారు. ఆసియన్‌ సునీల్‌తో కలిసి వెంకటేశ్‌, రానా, మహేశ్‌ బాబు భాగస్వామ్యంతో డ్రైవ్‌ ఇన్‌ థియేటర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.