• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాడ్ వివాదంలో ‘అమితాబ్’

    బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ యాడ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన ఫ్లిప్‌కార్ట్ ‘ది బిగ్ బిలియన్ డేస్’ యాడ్ వివాదాస్పదమైంది. దీనిపై వ్యాపార సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసపూరితంగా ఉన్న ఈ యాడ్ ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని అమితాబ్‌కు లేఖ రాసింది. స్థానిక వ్యాపారాలను దెబ్బతీసేలా ప్రకటన ఉందని లేఖలో పేర్కొంది. దుకాణదారుల వద్ద డీల్‌లు, ఆఫర్లు అందుబాటులో లేవని చెప్పడం కస్టమర్లను తప్పుదారి పట్టించడం, ప్రభావితం చేయడమే అవుతుందని చెప్పింది. ఈ మాటలకు అమితాబ్ వివరణ ఇవ్వాలని కోరింది.

    World Cup 2023: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?

    ఈ సారి వరల్డ్‌కప్‌కు ప్రకటనల ఆదాయం భారీగా పెరుగుతుందన్న అంచాలు నెలకొన్నాయి. ఈ కప్, దాదాపు రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2019 ప్రపంచకప్‌లో కంటే ఈ సారి రెట్టింపు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగుతాయని యాడ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయితే 2019 వరల్డ్‌కప్‌లో డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆదాయం రూ.400-500 కోట్ల లోపే ఉంది. ఈ సారి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో క్రికెట్‌కు భారీ క్రేజ్ ఏర్పడి నందున ఆదాయం … Read more

    వారి వల్ల రూ.40 కోట్లు పోగొట్టుకున్నా: హీరోయిన్

    దేశ వ్యతిరేక శక్తులపై గళమెత్తడం వల్ల రూ.30 కోట్ల నుంచి రూ.40 వరకు నష్టపోయానని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తెలిపారు. ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల 20 నుంచి 25 యాడ్స్ తాను కోల్పోయానని చెప్పారు. తనకు ప్రకటనల్లో నటించే అవకాశం లేకుండా చేశారని చెప్పారు. రాత్రికి రాత్రే కొందరు ఒప్పందాలను రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇప్పడు తాను స్వేచ్ఛాజీవినని పేర్కొంది. కాగా కంగనా ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తోంది.