• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పసుపు బోర్డుకు కేబినెట్ ఆమోదం?

    ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇటీవల ప్రధాని ఇచ్చిన హామీలు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని మంత్రి మండలి ఆమోదించనుంది. కేబినెట్ ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండటంతో కేంద్రమంతి కిషన్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. నిన్నటి వరకు హైదరాబాద్‌లో బిజీగా ఉన్న కిషన్ రెడ్డి రాత్రి ఫోన్ రావటంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కేబినెట్ సమావేశం అనంతరం హోంమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.

    అభ్యర్థుల ఎంపికపై షా, కిషన్ రెడ్డి భేటీ

    ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రేపు నిజామాబాద్ వేదికగా జరగనున్న మోదీ సభపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని ప్రధాని సభలు పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి మహబూబ్‌ నగర్ సభలో పసుపు బోర్డును మోదీ ప్రకటించిన నేపథ్యంలో నిర్మల్, కరీంనగర్‌లో ప్రధాని బహిరంగ సభలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.