• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకే ఇంట్లో ఏడుగురి మృతి

    గుజరాత్‌ దారుణ ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతిచెంది ఉన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఆర్థిక లావాదేవీల కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడుగురు విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో విషపదార్థంతో కూడిన ఓ సీసాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

    ప్రగతిభవన్ ఎదుట దంపతులు ఆత్మహత్యాయత్నం

    డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదని ప్రగతిభవన్ ఎదుట ఇద్దరు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్ (40) తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గతంలో డబుల్ బెడ్‌రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ముంజూరైనట్లు ఇటీవల అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత సదరు అధికారుల చుట్టూ తిరిగినా వారు స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన మహేందర్ కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.