బలమైన టెలికాం బ్రాండ్గా జియో
దేశంలో అత్యంత శక్తివంతమైన టెలికాం బ్రాండ్గా జియో నిలిచినట్లు టీఆర్ఏ తెలిపింది. జియో తర్వాత ఎయిర్టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ నిలిచాయి. కాగా దుస్తుల విభాగంలో అడిదాస్, ఎలక్ట్రానిక్స్లో ఎల్జీ, వాహనాల్లో బీఎండబ్ల్యూ, బ్యాంకింగ్లో ఎస్బీఐ, ఆహార ఉత్పత్తుల్లో అమూల్, ఎఫ్ఎంసీజీలో ఫాగ్ స్ప్రే, విద్యుత్ ఉత్పత్తుల్లో ఫిలిఫ్స్, ఆరోగ్య ఉత్పత్తుల్లో హిమాలయ, రిటైల్లో కేఎఫ్సీ, ఇంటర్నెట్ బ్రాండ్లలో అమెజాన్, మెబైల్ ఫోన్లలో ఎంఐ ఫోన్లు ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడించింది.