• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీడీపీ మాజీ అధ్యక్షుడిపై కేసు

    తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌పై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకొని దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ నేత డాక్టర్‌ ఏ.ఎస్‌.రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యాలయంలోనికి వెళ్లకుండా కాసాని జ్ఞానేశ్వర్, సభ్యులు ప్రకాశ్‌ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, ప్రశాంత్‌ యాదవ్‌ తదితరులు తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో కుడికంటిపై గాయమైందని తెలిపారు.

    టీటీడీపీకి కాసాని రాజీనామా

    తెలంగాణలో టీడీపీకి బిగ్‌షాక్ తగిలింది. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో టీడీపీ పోటీ చేయకపోవడంపై కాసాని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయాల్సిందేనని కొందరు నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే కాసాని భావోద్వేగానికి గురయ్యారు.

    89 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ?

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గాల వారిగా టికెట్ ఆశిస్తున్న వారిని ఎంపిక చేసింది. ఈ వివరాలతో కూడిన జాబితాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జైలులో ఉన్న చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలకు 189 మంది పేర్లతో జాబితా రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం.