• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిజమై తప్పక ఉండి ఉంటది: విజయశాంతి

    ఎన్డీఏలో చేరుతానని తనతో కేసీఆర్ చెప్పారన్న మోదీ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్న వేళ.. విజయశాంతి ఆయన వ్యాఖ్యలను సమర్థించింది. “ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఎన్డీఏలో చేరుతామని కేసీఆర్ అడిగి ఉండవచ్చు. నిజమై తప్పక ఉండి ఉంటది. 2009లో కూడా తెలంగాణలో మహాకూటమి పేర కమ్యూనిష్టులతో కలిసి పోటీ చేసిన కేసీఆర్.. కౌంటింగ్ డబ్బాలు తెరవక ముందే లూధియానాలో ఎన్డీఏ ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకం ఉంది. కేటీఆర్ ఈ విషయంలో మోదీని తిట్టటం సరికాదు” అని చెప్పారు.

    ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్

    ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలోనే పదిలంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలోనే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. బీజేపీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మోదీ మార్చారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.