• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అవినీతి అంతం కావాలి: అమిత్ షా

    బెంగాల్‌లో అవినీతి, దౌర్జన్యాలు త్వరలోనే అంతం కావాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. నేడు ఆయన పశ్చిమబెంగాల్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా షా మట్లాడుతూ.. బెంగాల్‌లో రాజకీయపరమైన మార్పు జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరాన్ని పోలినట్లుగా కోల్‌కతాలో దుర్గమ్మ మండపాన్ని తీర్చిదిద్దిన నిర్వాహకులను అమిత్ షా ప్రశంసించారు.

    దోమలను ఆసుపత్రికి తెచ్చిన వ్యక్తి!.. వైద్యులు షాక్

    పశ్చిమ బెంగాల్‌‌లో ఓ వ్యక్తి చేసిన పనికి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తనకు కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఈ దోమలను పరీక్షించి ముందస్తుగా తనకు సరైన వైద్యం చేయాలంటూ కోరాడు. దీంతో వైద్యుడుతో సహా అక్కడున్న వారంతా షాకయ్యారు. అలీ షేక్ అనే వ్యక్తి ఇంటి వద్ద దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో అతడు భయంతో దోమలను ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో వేసుకుని నేరుగా స్థానిక ఆసుపత్రికి వచ్చాడు.