• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలు

    గాజాలో పౌరుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. . ఇజ్రాయెల్‌ దాడుల్లో వేలాది మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి మృతదేహాలను భద్రపర్చేందుకు చోటు సరిపోవడం లేదు. దీంతో ఐస్‌క్రీమ్‌ ట్రక్కుల్లో మృతదేహాలను ఉంచే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గజాలో అత్యంత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 2,600 మందికి పైగా పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు. వారిని కాల్చేందుకు శ్మశానవాటికల్లోనూ స్థలం సరిపోకపోవడం లేదు.

    పిల్లలను ఆడిస్తున్న హమాస్‌ మిలిటెంట్లు

    ఇటీవల ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.. అక్కడ్నుంచి కొంతమంది పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆ బందీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో ఉగ్రవాదులు బందీల పిల్లలను ఆడిస్తూ, కన్పించారు. ఓ మిలిటెంట్‌ ఒక చేతిలో ఏకే-47 తుపాకీ పట్టుకుని చంటిబిడ్డను ఎత్తుకుని ఆడిస్తున్నాడు. బందీలను తాము క్షేమంగానే చూసుకుంటున్నామనే సందేశాన్ని ఇచ్చేందుకే మిలిటెంట్లు ఈ వీడియోను విడుదల చేశారని అభిప్రాయాలు వస్తున్నాయి.