• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ ప్రభుత్వంపై పురందేశ్వరి ఫైర్

    ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో కల్తీ మద్యం తయారవుతుందని ఆరోపించారు. ఆయా కంపెనీల ఆరోపణలపై సీఎం జగన్ ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చలగాటం అడుతోందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

    బీజేపీ, జనసేన పొత్తుపై కీలక ప్రకటన

    జనసేనతో పొత్తుపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు అంశంపై పవన్‌ కళ్యాణ్‌ ప్రకటనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పొత్తుపై పవన్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారని చెప్పారు. పవన్‌ అభిప్రాయంపై వెంటనే స్పందించలేమన్నారు. పవన్ విషయంలో అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని పురందేశ్వరి పేర్కొన్నారు.