• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ సినిమా నన్ను కదిలించింది; సింగర్ సునీత

    [వీడియో;](url) ‘రంగమార్తాండ’ సినిమా తనను ఎంతగానో కదిలించిందని ప్రముఖ సింగర్ సునీత తెలిపారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రంగమార్తాండ సినిమా స్పెషల్ షో చూశా. ఈ చిత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో పాత్రలను డైరెక్టర్ కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం చూశాక నా గుండె బరువెక్కిపోయింది. మీ హృదయం కదిలించే సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి.’’ అంటూ సునీత పోస్ట్ చేసింది. కాగా ‘రంగమార్తాండ’ ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. https://www.instagram.com/reel/Cp26cmUPWlM/?utm_source=ig_web_copy_link

    ‘నాటకరంగం వేరు’ పాట విడుదల

    రంగమార్తాండ సినిమా నుంచి మరో పాట విడుదలైంది. ‘నాటకరంగం వేరు.. జీవితరంగం వేరు’ అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయ రాజా స్వరాలు సమకూర్చి పాటను ఆలపించారు. ఇదే సినిమాలోని ‘పువ్వై విరిసే ప్రాణం’ పాటకి రీప్రైసిడ్ వెర్షన్‌గా దీనిని రూపొందించారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

    ‘రంగ‌మార్తండ‌’లో చిరంజీవి?

    క‌ళాకారులు, వారి క‌ష్టాల‌ను తెలియ‌జేసే క‌థ‌గా కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ‌’. ఈ సినిమాకు సినిమాకు సంబంధించిన ఒక వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. అయితే వీడియోలో అంద‌రి వివ‌రాలు వెల్ల‌డించిన త‌ర్వాత చివ‌ర్లో చిరంజీవి పేరుతో పాటు ఒక క్వ‌శ్చ‌న్ మార్క్ క‌నిపించింది. దీంతో చిరంజీవి కూడా సినిమాలో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాకు చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు ఆయ‌న ఒక చిన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని హింట్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. … Read more