• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారాస 25 సీట్లకే పరిమితం: రేవంత్‌

    తెలంగాణలో కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస పనైపోయిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరన్నారు. భారాస సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి వస్తున్నారంటేనే తమ బలమేంటో అర్థమవుతుందన్నారు. భారాసకు ఈసారి 25 సీట్లు దాటే అవకాశం లేదని రేవంత్‌ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 19 శాతం ఓట్లు అన్‌ డిసైడెడ్‌ మోడ్‌లో ఉన్నాయని, ఇందులో మెజారిటీ షేర్ తమకే వస్తుందన్నారు.