• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు సుప్రీం ముందుకు చంద్రబాబు కేసు

    సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన చంద్రబాబు పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. తన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంలో SLP వేశారు. ఈ కేసును చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదించనున్నారు. కేసు వివరాలను సోమవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఏపీకి సంబంధించిన కేసు, అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

    సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్

    క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారం విచారించనుంది. అటు సీఐడీ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

    నేడు సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణ

    నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించింది. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. కవిత కేసును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం విచారించనుంది. మరోవైపు నిన్న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందించింది. అవి ఈడీ నోటీసులు కాదు.. మోదీ నోటీసులు అంటూ ఎద్దేవా చేసింది.

    అలా పుట్టినవారికీ ఆస్తిలో వాటా

    అక్రమ సంతానానికి కూడా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. చెల్లుబాటు కాని లేదా రద్దు చేయదగ్గ వివాహాల ద్వారా జన్మించిన పిల్లలు చట్టబద్దమైన వారసులేనని తేల్చిచెప్పింది. వివాహేతర సంబంధంతో పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుందా అని ఓ వ్యక్తి వేసిన పిల్‌ను సుప్రీం పరిశీలించింది. అలాంటి సంతతి పిల్లలకు తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా ఉంటుందని పేర్కొంది. వారసత్వ ఆస్తిలో వాటా పొందే హక్కు వారికి కూడా ఉంటుందని తెలిపింది.

    కవిత అభ్యర్థన తిరస్కరించిన సుప్రీంకోర్టు

    ఈడీ విచారణకు వ్యతిరేకంగా కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై 24న విచారణ జరగాల్సి ఉన్నా… వాయిదా పడే అవకాశం ఉంది. సర్వోన్నత న్యాయస్థానం బిజీ షెడ్యూల్ కారణంగా మారుతుందని తెలుస్తోంది. మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 15న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్‌ను ప్రస్తావించారు. త్వరగా విచారణ చేపట్టాలని న్యాయవాదులు కోరారు. మార్చి 24న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తెలిపారు. అయితే తాజాగా జాబితాలో విచారణ మార్చి 27న … Read more