• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆలస్యమే మా స్ట్రాటజీ: కిషన్ రెడ్డి

    తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సిద్ధంగా ఉన్నామని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలన్నది మా పార్టీ ఇష్టం. నామినేషన్ చివరి రోజు వరకు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం మా ఎన్నికల స్ట్రాటజీ. అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే 50 శాతం పూర్తి చేశాం అని చెప్పుకొచ్చారు.

    అభ్యర్థుల ఎంపికపై షా, కిషన్ రెడ్డి భేటీ

    ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. రేపు నిజామాబాద్ వేదికగా జరగనున్న మోదీ సభపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని ప్రధాని సభలు పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి మహబూబ్‌ నగర్ సభలో పసుపు బోర్డును మోదీ ప్రకటించిన నేపథ్యంలో నిర్మల్, కరీంనగర్‌లో ప్రధాని బహిరంగ సభలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.