• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

    అమెరికాలో కత్తిపోట్లకు గురై చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి మృతి చెందాడు. అమెరికాలో ఖమ్మం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్‌(29) ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. గత నెల 31న జిమ్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో దాడి చేశాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతిచెందాడు.

    అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తితో దాడి

    అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో ఖమ్మం జిల్లాకు చెందిన వరుణ్‌రాజ్‌(29) ఎంఎస్‌ చదువుతూ పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో అతడిపై దాడిచేశాడు. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారు. వరుణ్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని పోలీసులు అందుపులోకి తీసుకున్నారు.