• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Akhanda 2: బాలయ్య – బోయపాటి మాస్‌ తాండవం షురూ.. రికార్డులన్నీ సర్దుకోవాల్సిందే! 

    టాలీవుడ్‌లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్‌ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్‌’ (Legend), ‘అఖండ’ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే వీరి కాంబోలో నాల్గో సినిమా కూడా రాబోతున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన సైతం వచ్చింది. అయితే తాజాగా ‘అఖండ 2’ ప్రాజెక్ట్‌ను మేకర్స్‌ పట్టాలెక్కించారు. ఇవాళ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    క్లాప్‌ కొట్టిన బ్రాహ్మణి

    బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). ‘తాండవం’ అనే పేరును క్యాప్షన్‌గా పెట్టారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి (Nara Brahmani), తేజస్విని (Tejaswini), ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌కు బ్రాహ్మణి క్లాప్‌ కొట్టారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నందమూరి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    టైటిల్‌ థీమ్‌ అదుర్స్‌ 

    అఖండ 2 సినిమాను గ్రాండ్‌గా లాంఛ్‌ చేసిన కాసేపటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ థీమ్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ థీమ్​కు మ్యూజిక్ సెన్సేషన్​ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది విన్న నందమూరి ఫ్యాన్స్​ టైటిల్​కే ఈ రేంజ్​లో ఇచ్చాడంటే సినిమాకు ఏ రేంజ్​లో ఇస్తాడో అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక థియేటర్లలో పూనకాలు రావడం పక్కా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా క్యాప్షన్‌కు తగ్గట్లు థమన్‌ తాండవం చేయడం కన్ఫార్మ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మీరు కూడా అఖండ్‌ 2 టైటిల్‌ను ఓ సారి వినేయండి.

    కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌!

    బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ (Akhanda) బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్​గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించారు. థమన్‌ BGM దెబ్బకు థియేటర్స్​లో సౌండ్​ బాక్స్​లు కూడా షేక్ అయిపోయాయి. ఆ సినిమా విజయంలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందనడంలో ఏమాత్రం సందేహాం లేదు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా హీరోయిన్​గా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

    యానిమేషన్‌లో బాలయ్య ప్రోమో

    ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించే అన్‌స్టాపబుల్‌ టాక్‌ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ మూడు సీజన్లుగా ఈ టాక్ షో ప్రసారం కాగా ఓటీటీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. బాలయ్య హోస్టింగ్‌ బాగుందంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4ను ప్రసారం చేసేందుకు ఆహా వర్గాలు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా ఇటీవల ‘బాలయ్య పండగ’ పేరుతో యానిమేషన్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు. యానిమేషన్‌ రూపంలో ఉన్న బాలయ్యను చూసి ఫ్యాన్స్‌ తెగ మురిసిపోయారు. అక్టోబర్‌ 24 నుంచి అన్‌స్టాపబుల్‌ 4 సీజన్ స్ట్రీమింగ్‌ కానుంది.

    నాన్నకు హ్యాట్సాఫ్‌ : తేజస్విని

    బాలకృష్ణ రెండో కూతురు నందమూరి తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి నిర్మాతగా, క్రియేటివ్ డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి అన్‌స్టాపబుల్ షోని నడిపించిన తేజస్విని ఇటీవల జరిగిన సీజన్‌ 4 లాంచింగ్‌ ప్రెస్‌ మీట్‌లో తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. అల్లు అరవింద్ ఈ టాక్‌షో గురించి చెప్పినప్పుడు అందరం చేద్దామా? వద్దా? అని తెగ ఆలోచించినట్లు తెలిపారు. కానీ తన తండ్రి మాత్రం చేయాల్సిందేనని చెప్పారన్నారు. ఆ ధైర్యమే ఇవాళ అన్‌స్టాపబుల్‌ని ఈ రేంజ్‌కి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. IMDB రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ షో వరల్డ్‌ 18వ ర్యాంక్ సాధించిందని గుర్తు చేశారు. తన తండ్రి ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని తేజస్విని అన్నారు. హిందూపూర్‌లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. నాన్నకు హ్యాట్సాఫ్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. తేజస్విని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యింది.

    రాజకీయ వారసురాలిగా తేజస్విని!

    బాలయ్య చిన్న కూతురు తేజస్విని తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడారు. తాను చెప్పాలనుకున్న అంశాలను ఏమాత్రం తడబడకుండా అర్ధవంతంగా తెలియజేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. తేజస్విని ఇంత బాగా మాట్లాడతారని తాము అసలు ఎక్స్‌పెక్ట్‌ చేయాలేదని కామెంట్స్‌ చేస్తున్నారు. ఆమె మాటల్లోని స్పష్టత చూస్తుంటే రాజకీయాల్లోనూ రాణించగలదన్న నమ్మకం తమకు కలుగుతోందని పోస్టులు పెడుతున్నారు. బాలయ్యకు రాజకీయ వారసత్వంగా తేజస్విని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, తేజస్విని భర్త భరత్‌ ఇప్పటికే వైజాగ్‌ ఎంపీగా గెలుపొందారు. రానున్న రోజుల్లో తేజస్విని రాజకీయాల్లో చూసే అవకాశం లేకపోలేదని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv