• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Bhumika Chawla: భూమిక చావ్లాకు ఘోర అవమానం.. ప్రేయసి కోసం ప్రాజెక్ట్‌ నుంచి తొలగింపు!

    టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్‌ హీరోయిన్లలో భూమిక చావ్లా ఒకరు. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రవితేజ, వెంకటేష్ వంటి స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసింది. ఆమె చేసిన ఒక్కడు, ఖుషీ, సింహాద్రి చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. అటువంటి భూమికకు హిందీలో ఘోర అవమానం జరిగింది. కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన ఈ విషయాన్ని భూమిక తాజాగా పంచుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ నుంచి ఆమెను అర్ధాంతరంగా తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    ఏడాది వెయిట్‌ చేసినా.. తప్పించారు!

    సుమంత్‌ హీరోగా రూపొందిన యువకుడు (2000) చిత్రంతో నటి భూమిక చావ్లా హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ఖుషి, వాసు, ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి చిత్రాలతో తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. సింహాద్రి తర్వాత హిందీలో చేసిన ఫస్ట్ ఫిల్మ్‌ ‘తేరే నామ్’ కూడా సక్సెస్‌ కావడంతో బాలీవుడ్‌లో ఈ అమ్మడికి వరుసగా రెండు ఆఫర్లు వచ్చాయి. అందులో ఒకటి మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ కాగా, మరొకటి ‘జబ్‌ వీ మెట్‌’. షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ జంటగా చేసిన  ‘జబ్‌ వీ మెట్‌’ తొలుత తనను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు భూమిక తాజాగా వెల్లడించారు. ఆ మూవీ కోసం దాదాపు ఏడాది పాటు ఎదురుచూసినట్లు చెప్పారు. డేట్స్ ఇష్యూ రాకుండా వేరే సినిమాలేవి ఒప్పుకోలేదని తెలిపారు. అయితే జబ్‌ వీ మెట్‌ సినిమాకు తొలుత బాబీ డియోల్‌ను హీరోగా అన్నుకున్నారని, ఆ తర్వాత అతడ్ని కాదని షాహీద్‌ కపూర్‌ను తెరపైకి తీసుకొచ్చారని భూమిక అన్నారు. ఆ తర్వాత తనను కూడా సైడ్‌ చేసి కరీనా కపూర్‌ను ఫైనల్‌ చేశారని వాపోయారు. ఇది తనను ఎంతో బాధించిందని చెప్పారు. ఆ సినిమా చేసి ఉంటే తన కెరీర్‌ మరోలా ఉండేదని పేర్కొన్నారు. 

    ఆ మూవీస్‌ సక్సెస్‌ సంతోషాన్నిచ్చింది: భూమిక

    హిందీలో తెరకెక్కిన ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ విషయంలోనూ భూమిక చావ్లాకు అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. సంజయ్‌ దత్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలోనూ తొలుత భూమికను హీరోయిన్‌గా అనుకున్నారు. అనివార్య కారణాలతో ఆమెను తప్పించి విద్యాబాలన్‌ను ఫైనల్‌ చేశారు. ఈ సినిమా హిందీలో బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమానే తెలుగులో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ పేరుతో మెగాస్టార్‌ రీమేక్‌ చేసి ఘన విజయం అందుకున్నారు. అయితే ఆ రెండు ఆఫర్లు కోల్పోయినప్పటికీ తెలుగులో తాను చేసిన ఖుషీ, ఒక్కడు, సింహాద్రి చిత్రాలు బాగా ఆడాయని భూమిక గుర్తు చేశారు. ఇటీవల రీరిలీజ్‌ కూడా అయ్యి మంచి వసూళ్లు సాధించడం సంతోషంగా ఉందని కామెంట్ చేశారు. 

    గర్ల్‌ఫ్రెండ్‌ కోసమే తప్పించారా?

    ‘జబ్‌ వి మెట్‌’ సినిమా నుంచి భూమికను తప్పించడం వెనుక ఓ బలమైన కారణమే ఉందని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ మూవీ సమయంలో బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌తో షాహిద్‌ కపూర్‌ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భూమికను తప్పించి తన ప్రియురాలుకు షాహిద్‌ కపూర్‌ ఛాన్స్ ఇప్పించారని విమర్శలు ఉన్నాయి. కానీ, ఆ తర్వాత వారిద్దరు విడిపోవడం ఆపై సైఫ్ అలీఖాన్‌ను కరీనా ఇష్టపడటం జరిగింది. కొద్ది కాలం తర్వాత సైఫ్‌ అలీఖాన్‌ను ఆమె రెండో వివాహం చేసుకుంది. అయితే షాహిద్‌ పక్కన భూమిక కన్నా కరీనా అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించి ఉండొచ్చని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చివరి క్షణంలో ఆమెను తప్పించినట్లు చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్స్‌ తర్వాత భూమిక హిందీలో పలు చిత్రాలు చేసినప్పటికీ అవి పెద్దగా కలిసిరాలేదు. 

    21 ఏళ్ల తర్వాత.. 

    ప్రస్తుతం భూమిక తెలుగులో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మెుదలు పెట్టింది. కీలకమైన సహాయక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. MCA (మిడిల్‌ క్లాస్ అబ్బాయి), సవ్యసాచి, రూలర్‌, పాగల్‌, సీటిమార్‌, సీతారామం, బటర్‌ఫ్లై వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యుఫోరియా చిత్రంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కడు వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత గుణశేఖర్‌ నటిస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. 21 ఏళ్ల తర్వాత గుణశేఖర్‌తో పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేశారు. కొత్త జర్నీ మెుదలైందంటూ రాసుకొచ్చారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv