• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆస్కార్‌ బరిలో ‘దోస్తీ’ పాట

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమా పేరును మార్మోగేలా చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుత నటకు జూ.ఎన్టీఆర్‌ ఆస్కార్‌ బరిలో ఉంటాడని సినీ విశ్లేషకులు ఇప్పటికే చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాలోని దోస్తీ పాట కూడా అకాడమీ అవార్డుల బరిలో నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. దోస్తీ పాటను తెలుగులో హేమచంద్ర ఆలపించగా, హిందీలో అమిత్‌ త్రివేది పాడారు. గంభీరంగా సాగే ఈ పాట విడుదలైన అన్ని భాషల్లోనూ శ్రోతలను అలరించింది.

    ACPపై దాడి చేసిన ఆందోళనకారులు

    బెంగాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కోల్‌కతాలో TMC ప్రభుత్వం అవలంభిస్తున్న అవినీతి చర్యలకు నిరసనగా బీజేపీ నేతలు పాదయాత్ర తలపెట్టగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు ACPని ఒక్కడినే చేసి ఓ పరుగెత్తించి కొట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. మరోవైపు పలువురు కార్యకర్తలు పోలీసుల వాహనానికి నిప్పటించారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. #Watch: Kolkata Police’s assistant commissioner attacked during the BJP … Read more

    ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

    సుధీర్ బాబు, కృతి శెట్టి జంట‌గా న‌టిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ఈ వారం విడుదల కాబోతోంది. సెప్టెంబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు.నాగచైతన్య సహా పలువురు యువ తారలు అతిథులుగా హాజరవుతున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    అందుకే పేరు మార్చుకున్నా: సబా ఆజాద్‌

    నటి, సంగీత దర్శకురాలు సబా ఆజాద్‌ తన పేరు మార్చుకోవడం వెనక గల ఇతివృత్తాన్ని వెల్లడించారు. హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు తెలిపారు. ‘ఆజాద్‌’ అనేది తన బామ్మ కలం పేరు అని అందుకే తన పేరులో చేర్చుకున్నానని సబా ఆజాద్‌ తెలిపారు. ‘దేవుడిని నమ్మని వ్యక్తిగా నాకు మా బామ్మ కలం పేరు నచ్చింది అందుకే పెట్టుకున్నా’ అన్నారు. పాస్‌పోర్టులో మాత్రం ఇప్పటికీ తన పేరు సబా గ్రేవాల్‌ అనే ఉంటుందని పేర్కొన్నారు. ‘నా తండ్రి సిక్కు , … Read more

    ‘గాడ్ ఫాదర్‌’ ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో రిలీజ్‌

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. వచ్చే నెల 5వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రేపు విడుదల కానుంది. అయితే ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. చిరు, సల్మాన్‌ కలిసి చిందులేసిన ఈ పాట అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెరపైనే గాక తెరవెనక కూడా చిరు, సల్లూ భాయ్‌ మంచి మిత్రులన్న సంగతి అందరికీ … Read more

    గుడ్‌ బై: 24 గంటల్లోనే 3 మిలియన్‌ వ్యూస్‌

    అమితాబ్‌ బచ్చన్‌, రష్మిక మంధాన కీలక పాత్రల్లో నటిస్తున్న బాలివుడ్‌ చిత్రం ‘గుడ్‌ బై’. విడుదలకు ముందే ఈ సినిమా పాజిటివ్‌ బజ్‌ సొంతం చేసుకుంటోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అమితమైన స్పందన వస్తోంది.తాజాగా విడుదలైన పాటకు కూడా విశేష స్పందన వస్తోంది. అమిత్‌ త్రివేది కంపోజ్‌ చేసిన మహాకాల్‌ పాటకు 24 గంటల్లోనే 2.9 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. కుటుంబ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వికాస్‌ బాహి దర్శకత్వం వహించాడు. అక్టోబర్‌ 7న విడుదల కాబోతోంది.

    విమాన ప్రయాణాల్లో జాగ్రత్త!

    విమాన ప్రయాణాలు చేస్తున్నపుడు గుర్తుతెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య అక్రమ రవాణా, డ్రగ్స్‌ రవాణాకు కేటుగాళ్లు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. తోటి ప్రయాణికుల్లా మాట కలిపి, మీకు తెలియకుండా మీతోనే అక్రమ రవాణా చేయిస్తున్నారు. మీతో పరిచయం పెంచుకుని ‘మా ఇంట్లో పెళ్లి ఉంది మీరు తప్పక రావాలి’ అంటూ చేతిలో కార్డు పెడతారు. అయితే అందులో బంగారం, డ్రగ్స్‌ వంటివి రవాణా చేసే ప్రమాదముంది. ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్‌ చేసి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. Never accept any … Read more

    అధికారిక లాంఛనాలతో నేడు అంత్యక్రియలు

    అనారోగ్య కారణాలతో ఆదివారం పరమపదించిన దిగ్గజ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మొయినాబాద్‌లోని కనకమామిడి ఫాం హౌజ్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. 11.30కి పార్థీవదేహం బయలుదేరుతుంది. ఈ వ్యవసాయ క్షేత్రాన్నికృష్ణంరాజు ఐదేళ్ల కిందట కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని నిర్మిస్తున్నారు. అది పూర్తికాక ముందే ఆయన అసువులు బాశారు.

    నాన్నెలా ఉండాలో చెప్పిన కృష్ణం రాజు

    ఇవాళ ఉదయం పరమపదించిన లెజెండరీ యాక్టర్‌ రెబెల్‌ స్టార్ కృష్ణం రాజు తన నటనా జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించారు. తొలి నంది అవార్డు సాధించిన నటుడిగా ఘనకీర్తి పొందారు. విలన్‌ పాత్రలతో మొదలుపెట్టి హీరోగా ఎన్నో విజయాలు సాధించారు. ప్రొడ్యూసర్‌గానూ సక్సెస్‌ను చూశారు. అయితే అదంతా తన తండ్రి పెంపకంలోని గొప్పదనమంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. పిల్లల్ని ఎలా పెంచాలో మా నాన్న గారే నిదర్శనమంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    ఊర్వశీని చూడగానే.. ‘పంత్.పంత్‌…’ అరుపులు.. వీరి మధ్య ఎఫైర్ నిజమేనా?

    దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. సినీతారలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకొంటున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా ఇలాగే ముంబయిలో ఉత్సవాలలో పాల్గొంది. లెహంగాతో అందంగా ముస్తాబై ఈ వేడుకకు వచ్చింది. హుషారుగా అక్కడ కాసేపు గడిపింది. ఆ తర్వాత ఇంటికెళ్లి.. ఓ పోస్టు పెట్టింది. ‘ఈ మ్యాటర్‌ని ఇంతటితో వదిలేయండి. లేకపోతే….’ అంటూ అందులో రాసుకొచ్చింది. ఇంతకీ ఏమైంది! వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఊర్వశీకి చేదు అనుభవం ఎదురైంది. ఊర్వశీని చూడగానే.. అక్కడి ప్రజలు రిషభ్ పంత్.. రిషభ్ పంత్ అని అరవడం … Read more