• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రక్షా బంధన్ స్పెషల్: టాలీవుడ్ హీరోలు, వారి సోదరీమణులు

    అన్నాదమ్ములు, అక్కాచెళ్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వయసుతో సంబంధం లేకుండా తమ సోదరులకు చేతికి సోదరీమణులు రాఖీ కడతారు. సోదరులకు కట్టిన రాఖీ వారికి రక్షగా నిలుస్తుందని తోబుట్టువులు భావిస్తారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల సోదరీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరీమణులు ఐదుగురు తోబుట్టువుల్లో చిరంజీవి పెద్దవాడు. పవన్ కళ్యాణ్ నాల్గవవాడు. విజయ దుర్గ, మాధవి రావు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సోదరీమణులు. గతంలో పలు ఇంటర్వ్యూలలో … Read more

    అతి పిన్న స్వాతంత్రోద్యమకారుడు ‘ఖుదీరాం బోస్’పై సినిమా

    దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారిలో ఖుదీరా బోస్ ఒకరు. తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా అతి చిన్న వయసులోనే పోరాడి 18 ఏళ్లకే ఉరి శిక్ష పాలైన వీరుడు. అటువంటి గొప్ప ఉద్యమ కారుడిపై ‘ఖుదీరాం బోస్’ పేరిట సినిమా రాబోతోంది. విద్యాసాగర్ రాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 15న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

    రాఖీ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తన తర్వాతి చిత్రం ‘భోళా శంకర్’ ద్వారా చిన్న వీడియోతో చిరు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ‘అక్కా చెల్లెల్లందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు ప్రేమతో మీ సోదరుడు చిరంజీవి’ అంటూ ఆయన మాటల్లో చెప్పారు. భోళా శంకర్ సినిమాను మెహెర్ రమేశ్ తెరకెక్కిస్తుండగా, AK ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

    పాకిస్తాన్ లో సంక్షోభంపై మహిళ ఆవేదన

    పాకిస్తాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా రోజువారీ జీవనమే కష్టమవుతోంది. తాజాగా ఈ విషయంపై కన్నీరు పెడుతూ ఓ మహిళ పెట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘నేనేం చేయాలి?, ఇంటి అద్దె కట్టాల్, పెరిగిపోయిన కరెంటు బిల్లులు కట్టాలా, మీకు పన్నులు కట్టాలా, నా పిల్లలకు మందులు కొనాలా?’ అంటూ కన్నీరు పెట్టుకుంది. తన పిల్లలకు కడుపునింపాలా? ఆకలితో చావనివ్వాలా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. [వీడియో](url) کراچی سے تعلق رکھنے والی ایک ماں نے حکمرانوں کو اپنا بجلی … Read more

    జెండా కొంటేనే రేషన్ బియ్యం

    ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్రం అనేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తోంది. అయితే పలుచోట్ల కొందరు వీటి విషయంలోనూ అతి చేస్తూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ వరుణ్ గాంధీ అలాంటి ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో జెండాను రూ.20 పెట్టి కొంటేనే రేషన్ బియ్యం ఇస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్న జెండా కోసం పేదోడి దగ్గర ధర కట్టడం దారుణమంటూ వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. [వీడియో](url) आजादी की … Read more

    అన్నా చెల్లెల్ల ప్రేమతో నిండిన కథ ‘ రక్షా బంధన్’

    అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రేపు విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం రక్షా బంధన్. అన్నా చెల్లెల్ల అనుబంధాన్ని చూపెడుతూ ఈ సినిమా తీశారు. మంచి కథలతో నిత్యం ప్రేక్షకుల ముందుకు వచ్చే అక్షయ్ కుమార్ ఈ సారి మరో భావోద్వేగాలున్న పాత్రలో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతి ఒక్కరూ తమ సినిమా చూడాలని అక్షయ్ ప్రేక్షకులను కోరాడు.

    అదిరిన ‘లైగర్’ జంట

    పూరీ,విజయ్ క్రేజీ కాంబినేషన్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘లైగర్’. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ముంబైలో నిన్న సినిమా ప్రచారం చేశారు. అయితే కార్యక్రమానికి ముందు ఆన్ స్క్రీన్ జంట విజయ్ దేవరకొండ, అనన్య పాండేతో పాటు రమ్యకృష్ణ ఫోటోలకు ఫోజులిచ్చారు. పులి చర్మం లాంటి చొక్కాలో విజయ్, ఎల్లో కలర్ స్కర్ట్ లో అనన్య, చీరలో అలనాటి తార మెరిశారు. ఆగస్ట్ 14న వరంగల్, ఆగస్ట్ 15న హైదరాబాద్లో చిత్రబృందం సందడి చేయనుంది. … Read more

    పర్యాటక కేంద్రం: ‘సావెహక్లు జలాశయం’

    కర్ణాటకలోని శివమొగ్గ సమీపంలో ఉన్న సావెహక్లు జలాశయం, వానాకాలంలో ఓ చక్కటి పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది. సావెహక్లు రిజర్వాయర్ చక్ర డ్యామ్‌కు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చక్ర డ్యామ్ కొడచాద్రికి 55 కి.మీ.ల దూరంలో ఉంది. నగర నుంచి కడచాద్రి వెళ్లే మార్గంలో ఈ అందమైన రిజర్వాయర్ మనకు కనిపిస్తుంది. చల్లని గాలులు, మబ్బులు కమ్మిన ఆవరణంల జలాశయంలోనే జలపాతం అందాలను చూడాలనుకునేవారికి ఇదొక చక్కటి స్పాట్‌.

    ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుండో..!

    ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో స్కూలు. పొద్దున 8.30 గంటలకు బస్సు. అక్కడెక్కడో కొండ, గుట్టల్లో బస్సు సప్పుడు అయితుందంటే బ్యాగులు పట్టుకుని, యుద్ధానికి సిద్ధమైయ్యే సైనికులోలె తయారైతుండె. బస్సు రాంగనే సీటు కోసం కొట్లాట. బస్సు ఎక్కినంక విండో సీటు కోసం కొట్లాట. ఇంకొందరు వెనక సీటు కోసం వీర లెవెల్ ఫైట్లు. అంతా అయిపోయి బస్ ఎక్కినాక..ఆ 20 కిలోమీటర్ల ప్రయాణం ఉంటది కదా…. స్వర్గసీమలో విహరించడమే! పాటలు, డ్యాన్సులు, ముచ్చట్లు ఒక లొల్లి కాదు. ఇప్పుడిదంత ఎందుకంటే ట్విట్టర్ లో … Read more

    ఆ ముగ్గురు కలిస్తేనే సినిమాకు విజయం: దిల్ రాజు

    బింబిసార విజయం తెలుగు సినిమాకు తిరిగి ఊపిరిపోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా తర్వాత తెలుగు సినిమా కష్టాల్లో పడిందని అన్నారు. థియేటర్లకు తిరిగి కళ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి విజయం రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఏ సినిమాకైనా డైరెక్టర్, హీరో, నిర్మాత చక్కగా కలిస్తే సినిమా అద్భుత విజయం సాధిస్తుందని బింబిసార మరోసారి నిరూపించిందని దిల్ రాజ్ పేర్కొన్నారు.