• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు చంద్రబాబు బెయిలు పిటిషన్‌ విచారణ

    స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు బెయిలు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదే కేసులో 37వ నిందితులు బెయిల్‌పై బయటే ఉన్నారు. చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాలి. ఇదే కేసులో ఏపీఎస్‌ఎస్‌డీసీ పూర్వ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. సీమెన్స్‌ సంస్థ, డిజైన్‌టెక్‌కు చెందిన ఎండీ, సీఎండీలు బెయిలు పొందిన వారిలో ఉన్నారు.

    చంద్రబాబు బెయిల్‌ షరతులు ఇవే!

    AP: స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ కాపీలో హైకోర్టు పలు షరతులు విధించింది. ‘చంద్రబాబు మీడియా, ఏ విధమైన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. కేవలం ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదు. బెయిల్‌ గడువు ముగిశాక నవంబర్‌ 24వ తేదీ సాయంత్రం లొంగిపోవాలి. చంద్రబాబు ఈ కేసును ఏ విధంగా ప్రభావితం చేయడానికి వీల్లేదు. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్‌ మరుక్షణమే రద్దు అవుతుంది’ అని తీర్పు కాపీలో జస్టిస్‌ మల్లికార్జున రావు స్పష్టం చేశారు.

    నేడు CBN బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు

    AP: తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్‌కు సంబంధించి నిన్న (సోమవారం) ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కాగా, చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు పెట్టింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది.