• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్‌పై రాజ్‌నాథ్ నిప్పులు

    జమ్మికుంటలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రెండు సార్లు ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో అభివృద్ధి లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగులు పరిక్ష రాసే పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి అన్నారు అది ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేశారు అని మండిపడ్డారు.

    నేడు ఆదిలాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ

    నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఆదిలాబాద్‌లోని 7 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా జనసమీకరణ చేస్తున్నారు. సుమారు లక్షమందిని సభకు తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. ఆదిలాబాద్‌లోని డైట్‌ మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా ఇతర ముఖ్య నేతలు సభకు హాజరుకానున్నారు.