• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హీరోలను చూసే టికెట్లు కొంటున్నారు: శ్రీలీల

    ఇప్పటికీ హీరోలను చూసే సినిమా టికెట్లు కొంటున్నారని యంగ్ హీరోయిన్ శ్రీలీల అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం 8 సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాను. ప్రస్తుతం నా చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండటం లేదు. ఇంట్లో కంటే సెట్స్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా. కెమెరా ముందు ఉండడం వ్యసనంగా మారింది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్నా. చదువు, నటన రెండూ బ్యాలెన్స్ చేసుకుంటా.’’ అంటూ చెప్పుకొచ్చింది.

    నేను ‘ఆర్ఆర్ఆర్’ చూడలేదు: ప్రియాంక చోప్రా

    తాను ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడలేదని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. ఇందుకు సమయం లేకపోవడమే కారణమని చెప్పింది. తాజాగా ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను ఎక్కువగా సినిమాలు చూడను. టీవీ షోలు ఎక్కువగా చూస్తుంటా.’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ‘ఆర్ఆర్ఆర్’ చూడలేదనే ప్రియాంక వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఇప్పటివరకు నీకు 3 గంటల సమయం దొరకలేదా’ అంటూ ప్రియాంకపై ఫైర్ అవుతున్నారు.

    సమంత చాలా మంచిదని చెప్పిన నాగచైతన్య.. సామ్ రిప్లై ఇదే

    సమంతతో విడాకులపై హీరో నాగచైతన్య స్పందించాడు. ‘‘సమంత చాలా మంచిది. సామ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మేము ఇద్దరం చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం. మేము మా జీవితాల్లో వేర్వేరుగా ముందుకు సాగుతున్నాం. కానీ మా ఇద్దరి జీవితాలపై రూమర్స్ రావడం బాధ పెడుతోంది. ఇప్పటికీ మా విడాకుల గురించి అడగటం చిరాకు తెప్పిస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో ఇటీవల కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. త్వరలోనే మేము విజయాల బాట పడతాం.’’ అంటూ చైతూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో.. కస్టడీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంగ్లిష్ పత్రికకు … Read more

    ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అయ్యా: సమంత

    తన జీవితంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదురైనా.. ధైర్యంగా ముందుకెళ్తున్నానని స్టార్ హీరోయిన్ సమంత పేర్కొంది. ‘‘ఒకప్పుడు నా జీవితం హ్యాపీగా గడిచిపోయేది. కానీ ఆ తర్వాత కొన్ని కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడి మరింత స్ట్రాంగ్‌గా తయారయ్యా. నాకు నేను ప్రత్యేకం అనుకోవడం లేదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అవి నా జీవితాన్ని నాశనం చేయకూడదని ముందుకెళ్తున్నా.’’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది.

    అందుకే మేకప్ వేసుకోను; సాయిపల్లవి

    మేకప్ లేకుండా న్యాచురల్‌గా కనిపించడానికే ఇష్టపడతానని హీరోయిన్ సాయిపల్లవి తెలిపింది. ‘‘నేను చిన్నప్పటి నుంచి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్ని. మొహంపై మొటిమలు ఉండేవి. నా గొంతు అంతగా బాగుండదు. నా తొలి సినిమా ‘ప్రేమమ్’లో మేకప్ లేకుండా నటించా. ప్రేక్షకులు నన్ను మేకప్ లేకుండానే ఇష్టపడ్డారు. దీంతో అప్పటి నుంచి మేకప్ లేకుండానే నటిస్తున్నాను. మేకప్ విషయంలో దర్శకులు, నిర్మాతలు నన్ను ఎప్పుడూ బలవంత పెట్టలేదు.’’ అంటూ తెలిపింది.

    ఆ డైరెక్టర్ వ్యాఖ్యలు దురదృష్టకరం; నాని

    ‘కేజీఎఫ్‌’ సినిమాపై టాలీవుడ్ దర్శకుడు వెంకటేశ్ మహా వ్యాఖ్యలు దురదృష్టకరమని న్యాచురల్ స్టార్ నాని అన్నారు. ‘దసరా’ మూవీ ప్రమోషన్లలో భాగంగా నాని స్పందించారు.‘‘నలుగురు దర్శకులు పాల్గొన్న చర్చా కార్యక్రమం చూశా. వెంకటేశ్ మాట్లాడిన విధం బాగా లేదు. అందుకే అతడు విమర్శలు ఎదుర్కొన్నాడు. అక్కడున్న నలుగురు దర్శకులు నాకు తెలిసిన వాళ్లే. చిన్న వీడియో క్లిప్ చూసి ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. ఇలా జరగడం దురదృష్టకరం.’’ అంటూ నాని పేర్కొన్నాడు

    ‘కేజీఎఫ్’పై టాలీవుడ్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

    [వీడియో;](url) కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్’ సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక తల్లి.. కొడుకును నువ్వు గొప్పోడివి కావాలంటుంది. బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడు అంటుంది. ఆ హీరో వెళ్లి బంగారం సంపాదిస్తాడు. దానిని తీసుకెళ్లి సముద్రంలో పారదొబ్బుతాడు. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొడుతున్నాం.’’ అంటూ సెటైర్లు వేశాడు. మహా వ్యాఖ్యలపై యశ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. Kanth gadu dengesina amount antha undav ra nee … Read more

    చచ్చేవరకూ దాదా వెంటే; మాజీ క్రికెటర్

    [వీడియో;](url) తాను చనిపోయేవరకు సౌరవ్ గంగూలీ వెంటే ఉంటానని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో సౌరవ్ గంగూలీపై చేతన్ శర్మ నెగిటవ్ కామెంట్లు చేశాడు. దీనిపై అతడి అభిమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో హర్భజన్ ఒకప్పుడు దాదా గురించి మాట్లాడిన వీడియోను అభిమానులు వైరల్ చేస్తున్నారు. ‘‘ఎవరున్నా లేకున్నా నేను దాదా వెంటే ఉంటా. చచ్చేవరకు గంగూలీ వెంటే నిలబడతా.’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Selfless achievement has a bigger … Read more

    కోలీవుడ్‌లో నన్ను పట్టించుకోవట్లేదు; వరలక్ష్మి

    కోలీవుడ్‌లో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ పేర్కొంది. తనకు అవకాశాలు ఇవ్వడానికి భయపడు తున్నారని తెలిపింది. ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తుండడంతో.. తమిళంలో అవకాశాలు రావడం లేదని చెప్పింది. తాను లేడీ విలన్‌గా వైవిధ్యంగా నటించానని .. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఆదరించ లేదని వాపోయింది. తనను చూసి భయపడి, ఇన్ సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారని చెప్పుకొచ్చింది. కాగా వరలక్ష్మి ‘క్రాక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

    అన్నిసినిమాలు హిట్ కావు! పూజా హెగ్డే

    మనం నటించిన అన్ని సినిమాలు ఘన విజయం సాధించలేవని బుట్టబొమ్మ పూజా హెగ్డే అన్నారు. తాను నటించిన కొన్ని చిత్రాలు విజయం సాధించలేదని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై పూజా స్పందించింది. ‘‘ఏమైనా తప్పులు చేసి ఉంటే సరిదిద్దుకుంటా. తప్పుల నుంచి నేర్చుకున్న పాఠాలతోనే ఈ స్థాయికి చేరుకున్నా. ఒక్కోసారి మనం ఊహించిన ఫలితాలు రావు. అలాగని మన నిర్ణయాలు తప్పేం కాదు. ఏదో ఒకరోజు మన జీవితం కూడా పరిపూర్ణంగా మారుతుంది.’’ అంటూ చెప్పుకొచ్చింది.