• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దీపావళి పండుగ.. చైనాకు లక్ష కోట్లు నష్టం!

    చైనాను అన్ని విధాలుగా నిలువరించే ప్రయత్నంలో భాగంగా ప్రధాని మోదీ ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ పేరుతో ప్రజలు దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై మొదలైన బాయ్‌కాట్‌ చైనాను కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఈ ఏడాదిలో దీపావళి రోజు దేశ వ్యాప్తంగా స్థానిక ఉత్పత్తుల అమ్మకాలతో చైనాకు సుమారు రూ.1లక్ష కోట్లు నష్టం వాటిల్లింది. గతంలో దీపావళి సందర్భంగా దాదాపు 70 శాతం చైనా ఉత్పత్తులే అమ్ముడయ్యేవి. ఈ మేరకు ఓ నివేదిక పేర్కొంది.

    దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?

    దీపావళి రెండు రోజులు రావడంతో 12, 13 ఏ తేదీల్లో జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. దీనిపై వేద పండితులు ఏం చేబుతున్నారో చూద్దాం.. కార్తీక మాస అమావాస్య నవంబర్ 12 మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని. అందుకే నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని’.పండితులు చెబుతున్నారు.

    దీపావళి పండుగ సెలవులో మార్పు

    ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగ సెలవును మార్పు చేసింది. ఈ నెల 12 నుంచి 13వ తేదీకి మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 13న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ అధిెకారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం సెలవుల జాబితా ప్రకారం ఈ నెల 12న దీపావళి సెలవుగా ఉంది. ఈ క్రమంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవుల జాబితాలో స్వల్ప మార్పులు చేశారు. 13వ తేదీని ఆప్షనల్ హాలిడే బదులుగా సాధారణ సెలవుగా ప్రకటించారు..